‘విసిగిపోయా.. బతకాలని లేదు..’, సూసైడ్కు ముందు స్నేహితురాలికి మెసేజ్!
భోపాల్: 'జీవితంలో విసిగిపోయా.. బతకాలనిపించడం లేదు..' ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తన ఆత్మహత్యకు ముందు స్నేహితురాలికి పంపించిన మెసేజ్ ఇది. చదువులో ఎప్పుడూ ముందుండే ఆ విద్యార్థిని రైలుకింద పడి ప్రాణాలు తీసుకుంది. అయితే ఆమె బలవన్మరణానికి సహ విద్యార్థి బ్లాక్ మెయిలింగే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని బైతూల్ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మహిమా పరివార్ ఒకవైపు తాను చదువుకుంటూనే మరోవైపు చిన్నారులకు ట్యూషన్ చెబుతుండేది. ఆమె తన సహవిద్యార్థి బ్లాక్మెయిలింగ్ భరించలేక ఇటీవల రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ యువకుడి ఆత్మహత్యా యత్నం.. ఫేస్బుక్లో లైవ్!
తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మహిమా పరివార్ తన స్నేహితురాలికి ఒక మెసేజ్ పెట్టింది. అందులో..'జీవితంలో విసిగిపోయా..' అని పేర్కొంది. ఆమె ఆ స్థితికి రావడానికి శ్రేయాంస్ అనే సహ విద్యార్థి కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల శ్రేయాంస్ తమ కుమార్తె ఫొటోలు తీసి బెదిరిస్తున్నాడని, బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డాడని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.