దేశం బయటివాడ్ని కాను, అర్థం లేదు: అజరుద్దీన్
ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ లోకసభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అజరుద్దీన్కు ప్రస్తుతం పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అజరుద్దీన్కు పార్టీ కార్యకర్తల నుంచి సహకారం లభించడం లేదని, స్థానికులకే టికెట్ ఇవ్వాలని ప్రదర్శనలు చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విధమైన అర్థంలేని మాటలను తాను విశ్వసించబోనని, చెన్నైకి చెందిన వ్యక్తులు పని చేయడానికి ముంబై వెళ్తారని, భారతదేశంలో ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
పార్టీ కార్యకర్తలు తనకు సహకరిస్తున్నారని, రాజస్థాన్ నుంచి పోటీ చేస్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని ఆయన పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. పార్టీకి, ప్రజలకు సేవ చేయడానికి తనకు ఓ వేదికను కల్పించారని ఆయన అన్నారు.
రాజస్థాన్ నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం తనను ఆదేశించిందని, అందుకు తనకు సంతోషంగా ఉందని, తాను క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి రాజస్థాన్కు సంబంధించి మంచి జ్ఞాపకాలున్నాయని, రాజస్థాన్ తన పట్ల ఎప్పుడూ దయాపూరితంగానే ఉందని, తాను ప్రజలను కలుస్తున్నానని, మొరాదాబాద్లో తాను చాలా అభివృద్ధి పనులు చేపట్టానని, ఇప్పుడు టోంక్ మాధోపూర్లో కూడా అటువంటి పనులు చేస్తానని అజర్ అన్నారు.