కశ్మీర్ హింసపై రాహుల్కు సవాల్ విసిరిన గవర్నర్...! హెలికాప్టర్ పంపిస్తా వచ్చి చూడన్న మాలిక్...!
ఎంపీ,కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఫైర్ అయ్యారు. కశ్మీర్లో హింస చెలరేగుతుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే రాహుల్ గాంధీకి ఆయన సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి నేనే ఓ హెలికాప్టర్ పంపిస్తాను. వచ్చి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి పరిశీలించమని అన్నారు.
జమ్ము కశ్మీర్ విభజన తర్వాత రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేశాడు. గత ఏడు రోజులుగా కశ్మీర్లో ఎలాంటీ హింసాత్మక సంఘటనలు లేకుండా కొనసాగుతుంది. ఈనేపథ్యంలోనే ఎలాంటీ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకపోవడంతోనే గత శుక్రవారం కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. మరోవైపు ఉద్యోగులు సైతం విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేయడంతోపాటు, విద్యాలయాలు కూడ వారం రోజుల్లోనే రీ ఒపెన్ అయ్యాయి. దీంతో కశ్మీర్లో బక్రిద్ కూడ ఎలాంటీ సంఘటనలు లేకుండా సామరస్యంగా జరుపుకున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే రాహుల్ గాంధీ మాత్రం కశ్మీర్లోలో చెలరేగుతుందని అక్కడ అసాధారణ పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీంతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ లాంటీ వ్యక్తి ఇలా మాట్లాడి ఉండకూడదని అన్నారు. అయన అసలు విషయం తెలుసుకుని మాట్లాడమని కోరారు. అక్కడ అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉందని కనీసం ఒక్క బుల్లెట్ లేకుండా పరిస్థితి ఉందని అన్నారు. అయితే హింస జరిగిందంటూ ఓ ఫారిన్ మీడీయా పేర్కోన్న కథనంపై వారిని హెచ్చరించినట్టు తెలిపారు. కాగా కశ్మీర్లో ఉన్న మొత్తం ఆసుపత్రులను ఓపేన్ చేసి ఉన్నాయని వాటిలో ఒక్కరు కూడ బుల్లెట్స్ తాకి చికిత్స్ పోందుతున్నారో నిరూపించాలని ఫైర్ అయ్యారు.