భారత్కు కొత్తగా 33 యుద్ద విమానాలు... రష్యాతో చర్చలు
భారత వాయుసేనను మరింత పటిష్టం చేసేందుకు భారత్ పూనుకుంది. ఈనేపథ్యంలోనే కొత్త 33 యుద్ద విమానాల కొనుగోలుకుు రంగం సిద్దం చేసింది. ఈ నేపథ్యంలోనే 21- మిగ్ ఫైటర్స్తోపాటు 12 సుఖోయ్ -30 విమానాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. వీటికి సంబంధించి మరికొద్ది రోజుల్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అమోదం తెలపనున్నట్టు సమాచారం.
మనవేళ్లు మన కంట్లోనే...! రాహుల్ గాంధీయో కాదు బీజేపీ నేతల పేర్లను ఇరికించిన పాకిస్థాన్
వైమానిక దళానికి చెందిన పలు యుద్ద విమానాలు ఇప్పటికే చాల వరకు కూలి పోయిన పరిస్థితి. దీనికి తోడు దాయదీ పాకిస్థాన్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతున్న నేపథ్యంలోనే భారత్ ముందు జాగ్రత్త చర్యగా మరిన్ని యుద్ద విమానాల కొనుగోలుకు రంగం సిద్దం చేసింది.
ఇందుకు సంబంధించి రష్యాతో చర్చలు కూడ ప్రారంభించింది. కొత్త విమానాల కొనుగోలు ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా రష్యాతో చర్చలు పూర్తి చేసుకోవాలని భారత వాయుసేన యోచిస్తోంది. కాగా ఇప్పటికే గడిచిన 15 సంవత్సరాల్లో 250కి పైగా సుఖోయ్ యుద్ద విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఇచ్చిన వాటితో భారత్కు పూర్తిగా యుద్ద విమానాలు సరిపోతాయని వాయుసేన అధికారులు తెలిపారు.