3 సంవత్సరాల్లో 27 జెట్ ఫైటర్లు నేలమట్టం అయ్యాయి... 550 కోట్ల నష్టం.. వాటిల్లింది.. కేంద్రమంత్రి
గత మూడు సంవత్సరాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 27 విమానాలు కుప్పకూలాయని కేంద్ర డిఫెన్స్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంట్ ప్రకటించారు. ఈ ప్రమాదాల ద్వార మొత్తం 525 కోట్ల రుపాయల నష్టం జరిగినట్టు ఆయన రాతపూర్వకంగా తెలిపారు.
కాగా ఇందులో భాగంగానే 2016-17 సంవత్సర కాలంలో ఆరు ఐఏఎఫ్ ఫైటర్ జెట్స్తోపాటు రెండు హెలికాప్టర్స్ ,ఒక ట్రాన్స్పోర్టు ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడంతోపాటు ఒక ట్రెయినర్ మృత్యువాత పడ్డాడు...ఇక 2017-18 సంవత్సరంలో రెండు ఫైటర్ జెట్స్, ఒక ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్లు కుప్ప కూలగా, 2018-19 సంవత్సరంలో కూడ 7 ఫైటర్ జెట్స్, రెండు హెలికాప్టర్ కూలియాయి..ఇందులో ఇద్దరు ట్రెయినీలు నేలకు రాలారు.
ఇక 2019-20 వ సంవత్సరంలో ఇటివల ఆరుణచల్ ప్రదేశ్లో ఏన్-32 ట్రాన్స్పోర్టు విమానం కుప్పకూలిపోయింది..కాగా ఈ ప్రమాదంలో 13 మంది సిబ్బంది చనిపోయారని తెలిపారు. వీటిలో పాకిస్థాన్ ఎయిర్ స్ట్ర్రైక్లో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో పాల్గోన్న మిగ్ -21 విమానం కూడ ఉంది.ఇక ఇందులో వింగ్ కమాండర్ అభినందన్ పైలట్గా వెళ్లిన విషయం తెలిసిందే...