గల్లంతైన విమానం: ఏఎన్-32 ప్లేన్ ప్రత్యేకతలు ఇవే
న్యూఢిల్లీ: చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఎన్ 32 విమానం శుక్రవారం ఉదయం అదృశ్యమైంది. ఈ విమానం కోసం ఎయిర్ ఫోర్స్ సిబ్బంది తీర, నౌకాదళ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ విమానానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం రెండు ఇంజిన్లను కలిగి ఉన్న ఎయిర్ క్రాఫ్ట్. దీనిని ప్రధానంగా కార్గో ప్లైట్గా వినియోగిస్తారు.
29 మందితో వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం
ఇప్పుడు అదృశ్యమైన విమానం మాత్రం 29 మందిని తీసుకు వెళ్తోంది. అందులో 23 మంది సిబ్బంది, ఆరుగురు క్రూ మెంబర్లు.
కార్గో పరంగా ఈ విమానం కెపాసిటీ 7.5 టన్నులు. ప్రయాణీకుల పరంగా చూస్తే 50 మందిని ఎక్కించుకోవచ్చు.
ఏఎన్ 32లో పది రకాలు ఉన్నాయి. An-32A, An-32B, An-32B-100, An-32B-110, An-32B-120, An-32B-300, An-32LL, An-32MP, An-32P ఫైర్ కిల్లర్, An-32B-200.
ఈ విమానం గంటకు 530 కి.మీ. ప్రయాణించగలదు. ఈ విమానం బరువు 16,800 కేజీలు. దీని గరిష్ఠ టేకాఫ్ బరువు 27,000 కేజీలు.
ఈ విమానాన్ని రెండు రకాల ఉపయోగాల కోసం తయారు చేశారు. ఒకటి సాధారణ ప్రజలు, మిలిటరీ ఉపయోగించే విధంగా ఉంటుంది. ఏఎన్ 32న నమూనా విమానం 1976లో తొలిసారి ప్రారంభించారు.