వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ డికే రవి కేసు: ఎయిమ్స్ బృందం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసులో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుల సహకారం తీసుకుని దర్యాప్తు పూర్తి చెయ్యాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.

ఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం సీనియర్ అధికారి సుధీర్. కే. గుప్తా నేతృత్వంలోని ప్రత్యేక బృందం వైద్యులు బెంగళూరు చేరుకుని సీబీఐ అధికారుల దర్యాప్తునకు సహకరించనున్నారు. డి.కే. రవి ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికే లభ్యం అయిన అన్ని సాక్షాలను ఎయిమ్స్ వైద్య బృందం పరిశీలించనుంది.

డి.కే. రవి ఆత్మహత్య చేసుకున్నాడని సీఐడి అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. తరువాత సీబీఐ అధికారుల దర్యాప్తులో ఇదే విషయం వెలుగు చూసింది. అయితే రవి ఆత్మహత్య చేసుకున్న సమయంలో సేకరించిన వీడియోగ్రఫి సాక్ష్యాలు, సంఘటనా స్థలాన్ని ఎయిమ్స్ బృందం పరిశీలించనుంది.

IAS officier DK Ravi Case, AIIMS team to re-examine

రవి మృతదేహం మీద గుర్తించిన గాయం ఎప్పుడు అయ్యింది, ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు గాయం అయ్యిందా, రవి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోస్టుమార్టం నివేదికలో కచ్చితంగా వెలుగు చూసిందా అని క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక తయారు చెయ్యనున్నారు.

డికే. రవి అనుమానాస్సద మృతి కేసు విషయంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. సీబీఐ అధికారులు దాదాపు ఈ కేసు దర్యాప్తు పూర్తి చేశారు. చివరిసారిగా ఎయిమ్స్ వైద్య బృందం సహకారంతో కేసు దర్యాప్తు పూర్తి చెయ్యాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.

English summary
Sudhir K Gupta led Forensic experts from All Indian Institute of Medical Sciences (AIIMS), New Delhi visiting Bangalore to solve the queries raised by CBI team regarding Death of IAS officer DK Ravi. AIIMS team to re-examine the video-graphic evidences and scene of the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X