కర్ణాటక ప్రభుత్వం కూలిపోతే తాను పార్టీకి రాజీనామ చేస్తా ... సిద్దరామయ్య
కర్ణాటకలో రాజకీయం సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉత్కంఠను రేపుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సుమారు ఇరవై మంది బీజేపీకి టచ్లో ఉన్నారని కర్ణాటకల బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు మరింత వేడిని రగిలించాయి. కాగా అంతకు ముందు కూడ కేంద్రమంత్రి సదానంద గౌడ సైతం జేడీఏస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని జోస్యం చేప్పారు. ఈనేపథ్యంలోనే ఈనెల ఆఖరులోగా ప్రభుత్వం పడిపోవడం ఖాయమని బీజేపీ నేతలు చెప్పారు.
దీంతో కర్టాటక రాష్ట్ర్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దరామయ్య బీజేపీ సవాల్ ప్రతిసవాల్ విసిరారు. యడ్యూరప్ప ప్రకటించినట్టుగా జూన్ 1లోగా ప్రభుత్వం పడిపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో కర్ణాటకలో అటు సంకీర్ణ ప్రభుత్వం ఇటు బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.ఓవైపు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని భావిస్తూంటే దాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ,జేడీఏస్ సంకీర్ణ కూటమీ పావులు కదుపుతోంది.