గాంధీని గాడ్సే చంపకపోయుంటే నేనే చంపేదాన్ని: పూజా శకున్ పాండే వివాదాస్పదం
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త పూజా శకున్ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీని గాడ్సే చంపకుంటే.. తానే చంపేదాన్నంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎం) ఆధ్వర్యంలో దేశంలోనే తొలి హిందూ కోర్టును ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు.
ఆ కోర్టుకు పూజా శకున్ పాండేను జడ్జీగా నియమించారు. ఈ క్రమంలో పూజా శకున్ పాండే ఓ మీడియా ఛానల్తో మాట్లాడారు. గాంధీని నాథూరామ్ గాడ్సే చంపకుండా ఉండి.. ఆ సమయంలో తాను పుట్టివుంటే తానే గాంధీని చంపేదాన్నని అన్నారు.
'నేటికైనా సరే.. దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే.. అడ్డుకునే గాడ్సే ఒకరుంటారు. నాథూరామ్ గాడ్సేను నేను ఆరాధిస్తానని చెప్పడానికి గర్విస్తాను' అని పూజ వ్యాఖ్యానించారు.
'గాంధీని గాడ్సే చంపలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేలోపే అతడిని శిక్షించారు. అందరూ అసలు చరిత్ర చదవాలి' అని ఆమె అన్నారు. గతంలో కూడా పూజ.. ట్రిపుల్ తలాక్ పేరుతో మోసపోయిన ముస్లిం మహిళలు హిందూ ధర్మాన్ని అనుసరించాలంటూ వ్యాఖ్యానించారు.