వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందేమాతరం ఆలపించే వారు భారత వ్యతిరేక శక్తులే: ప్రకాష్ అంబేడ్కర్

|
Google Oneindia TeluguNews

ప్రభాని: దేశభక్తి గీతం వందేమాతరం పాడినవారంతా భారత్‌కు వ్యతిరేకం అన్నారు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మనువడు ప్రకాష్ అంబేడ్కర్. " జనగణమన పాడితే నేను భారత్‌కు వ్యతిరేకం అంటున్నారు. అదే వందేమాతరం గీతం ఆలపిస్తే నేను నిజమైన భారతీయుడిని అని అంటున్నారు. ఇలా సర్టిఫికేట్ ఇచ్చేందుకు మీరెవరు..? వందేమాతరం ఎవరైతే పాడుతారో వారు భారత వ్యతిరేక శక్తులు అని నేను చెబుతున్నాను" అని ప్రకాష్ అంబేడ్కర్ నిప్పులు చెరిగారు.

2019 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మహారాష్ట్రలో ప్రకాష్ అంబేడ్కర్ పార్టీ భరిప బహుజన్ మహాసంగ్ మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు గతనెలలో ప్రకటన చేశారు. ఈ ఏడాది ఆగష్టులోనే వందేమాతరం తప్పని సరి చేయడం రాజ్యాంగ విరుద్ధమని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అంతేకాదు ప్రధాని దేశంలో ఒక్క మతాన్నే ప్రమోట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా హిందూ మతాన్ని మాత్రమే దేశంలో ప్రమోట్ చేయడం ద్వారా దేశ లౌకికత్వం దెబ్బతింటుందని ఓవైసీ ధ్వజమెత్తారు.

If you sing Vandemataram then you are anti India: Praksah Ambedkar

మహారాష్ట్రలోని అకోలా నియోజకవర్గానికి ఒకప్పుడు ఎంపీగా పనిచేశారు ప్రకాష్ అంబేడ్కర్. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వామపక్షాలు ఆయన్ను నామినేట్ చేశాయి. ఆనాడు ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పై పోటీకి ప్రకాష్ అంబేడ్కర్‌ను నిలబెట్టాయి వామపక్షాలు.

English summary
Prakash Ambedkar, the grandson of Dr B R Ambedkar and chief of Bharipa Bahujan Mahasangh alleged that those who sing Vande Mataram are anti-India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X