సంతృప్తినివ్వని జాబ్.. ఉన్నత చదువుల కోరిక.. చివరికి ఆత్మహత్య
చేస్తున్న ఉద్యోగంతో సంతృప్తి లేదని ఓ యువకుడు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గుర్గావ్లోని డీఎల్ఎఫ్ మంగోలియాస్ అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా..
న్యూఢిల్లీ : చేస్తున్న ఉద్యోగంతో సంతృప్తి లేదని ఓ యువకుడు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గుర్గావ్లోని డీఎల్ఎఫ్ మంగోలియాస్ అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా.. సోమవారం ఉదయం వెలుగు చూసింది.
రాజస్థాన్కు చెందిన అంకిత్ వాద్వా ఐఐటీ కాన్పూర్ నుంచి 2015లో ఎంబీఏ పట్టా పొందాడు. ఆ తర్వాత ముంబయిలోని జేపీ మోర్గాన్ కంపెనీలో పని ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగంతో సంతృప్తి లేదని ఈ ఏడాది మార్చిలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
అప్పట్నుంచి అంకిత్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు అతడి స్నేహితులు చెప్పారు. ఉన్నత చదవులు చదవాలని అంకిత్ కు బలమైన కోరిక ఉండేదని.. ఈ క్రమంలోనే అతడు జీమ్యాట్కు కూడా ప్రిపేర్ అవుతున్నాడని చెప్పారు.
అంకిత్ ఒత్తిడి కారణంగానే.. తను ఉంటున్న డీఎల్ఎఫ్ అపార్ట్మెంట్లోని 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.