వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఐఐటీ, నిట్ ఇంజనీరింగ్ ఆడ్మిషన్ల కౌన్సిలింగ్‌‌పై సుప్రీంకోర్టు స్టే

ఐఐటీ, నిట్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడ్మిషన్ల కౌన్సిలింగ్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యార్ధులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఐఐటీ, నిట్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడ్మిషన్ల కౌన్సిలింగ్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యార్ధులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ప్రశ్నాపత్రంలో 18 తప్పుడు ప్రశ్నలకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పుతో ఐఐటి జేఈఈ ఆడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోనుంది. దేశవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులపై తీర్పు ప్రభావం చూపనుంది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదావేసింది.

IIT-JEE Advanced 2017: Supreme Court stays admissions, counselling over grant of extra mark

దీనికితోడు దేశంలోని ఏ హైకోర్టు కూడ ఇక ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు సంబంధించిన ఫిర్యాదులను తీసుకోవద్దని జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా శనివారంలోపుగా ఈ ప్రవేశ పరీక్షపై ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల గురించి వాటిని వేసిన పిటిషనర్ల సంఖ్య వివరాలను తెలపాలని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరళ్ళను ఆదేశించింది.

హిందీ భాష ప్రశ్నాపత్నం ముద్రణంలో తప్పిదాల వల్ల జేఈఈ ప్రవేశపరీక్ష రాసిన వారందరికీ అదనంగా ఏడు మార్కులు కలపడంపై కేంద్రానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది.

English summary
The Supreme Court on Friday restrained the Indian Institute of Technology (IITs) across the country till further orders from conducting counselling or admitting students subsequent to the Joint Entrance Examination this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X