Illegal affair: ఆంటీతో గుసగుసలాడాడు, గుహలోకి తీసుకెళ్లాడు, తిరిగిరాలేదు, కూతురి పెళ్లితో జల్సా !
చెన్నై/ వేలూరు/ చిత్తూరు: ఒకే చోట పని చేస్తున్న సమయంలో ఆంటీతో అతను పరిచయం పెంచుకున్నాడు. తరువాత పని చేస్తున్న సమయంలో ఆంటీతో రాసుకునిపూసుకుని తిరుగుతున్న అతనికి ఆమె అందానికి పచ్చిపట్టిపోయిందో ఏమో ? ఎలాగైనా వలలో వేసుకోవాలని ప్రయత్నించాడు. అదే సమయంలో ఆంటీ భర్త చనిపోయాడని తెలుసుకున్న వ్యక్తి ఎట్టకేలకు ఆమెను లొంగదీసుకున్నాడు. కూతురికి పెళ్లి అయిపోవడంతో అడిగేవాళ్లు లేకపోవడంతో అతనితో ఆంటీ పిచ్చపాటిగా జల్సా చేసింది. అంతే కొండ మీద రాజుల కాలంలో నిర్మించిన గుహలోకి ప్రియుడు ఆంటీని పిలుచుకుని వెళ్లాడు. అంతే ఆంటీ గుహలో నుంచి బయటకు రాలేదు.
Torture: ఆంటీ అదిరిందని రేప్ చేసి చంపేశాడు, 10 నెలలకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి, సార్ ఆ రోజు !
ఆంధ్రా బార్డర్
ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులోని వేలూరు జిల్లా, అనకట్ట సమీపంలోని వల్లిమలై కొండ మీద రాజుల కాలంలో నిర్మించిన సమనార్ అనే గుహలో సుమారు 55 ఏళ్ల మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో కొన్ని ఆనవాళ్లు సేకరించిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. గుహలో మహిళ హత్యకు గురైన విషయం వేలూరు జిల్లాలో కలకలం రేపింది. ఎవరిది ఈ శవం ? అంటూ చాలా గందరగోళానికి దారితీసింది. హత్యకు గురైయ్యింది ఆంధ్రా మహిళ ? తమిళనాడు మహిళ ? అనే విషయం మొదట అంతుచిక్కలేదు. కొన్ని రోజుల నుంచి ఈ కేసు విచారణలో ఉంది.
అన్బు భలే రసికుడు
వేలూరు జిల్లాలోని ఆనకట్టు ప్రాంతం సమీపంలోని కిలకోటూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న అన్బు (42) అనే వ్యక్తి మంచి రసికుడు అని స్థానికులు అంటుంటారు. పరాయి స్త్రీల మీద అన్బుకు చాలా వ్యామోహం ఉందని తెలిసింది. ఇతనికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. అన్బు కుమార్తెకు ఇటీవలే వివాహం అయ్యింది.
ఆంటీ ఒంటరి జీవితం
వేలూరు నగరం సమీపంలోనే కరుగంబధూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న వత్సల (55) అనే మహిళ భర్త చనిపోయాడు. వత్సల ఒక్కగాన ఒక్క కుమార్తెకు రెండు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వత్సల కుమార్తె ఆమె భర్తతో కలిసి ఉంటున్నది. వత్సల ఆంటీ ఒంటరిగా ఉంటూ కాలం గడుపుతోంది. వత్సల, అన్బు ఒకే చోట పని చేస్తుండటంతో వారికి ఇంతకు ముందే పరిచయం ఉంది.
ఆంటీని అనుభవించాలని కసి
వత్సల ఆంటీ భర్త చనిపోయాడని అన్బుకు తెలిసింది. అందంగా నాటుకోడిలా పిటపిటలాడుతున్న వత్సల ఆంటీని ఎలాగైనా అనుభవించాలని రగిలిపోతున్న అన్బు ఆమెతో రాసుకుంటూ పూసుకుంటూ తిరిగేవాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న వత్సల ఆంటీలో కామకోరికలు పుట్టేలా చేసిన అన్బు చివరికి ఆమెను వలలో వేసుకున్నాడు.
ఆంటీని అడిగే దిక్కేలేరని ఎంజాయ్
ఆంటీ కూతురికి పెళ్లి అయిపోవడం, ఆమె భర్తతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉండటంతో వత్సల ఎప్పుడుపడితే అప్పుడు ప్రియుడు అన్బుతో కలిసి బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. వత్సల, అన్బల అక్రమ సంబంధం చెయ్యిదాటిపోయింది. ఈనెల 7వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన వత్సల తరువాత ఇంటికి తిరిగిరాలేదు. రెండు రోజుల వత్సల కోసం వేచి చూచిన ఆమె బంధువులు చివరికి వేలూరు నార్త్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వత్సల కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు.
అవును........వత్సల ఆంటీ
గుహలో మహిళ హత్యకు గురైన విషయం వేలూరు జిల్లాలో కలకలం రేపింది. ఎవరిది ఈ శవం ? అంటూ చాలా గందరగోళానికి దారితీసింది. హత్యకు గురైయ్యింది ఎవరు ? అనే విషయం మొదట అంతుచిక్కలేదు. తరువాత సంఘటనా స్థలంలో చిక్కిన ఆధారాలను వత్సల బంధువులకు చూపించారు .అవును ఈ వస్తువులు వత్సలవే అని ఆమె బంధువులు పోలీసులకు చెప్పారు. వత్సల హత్యకు గురైయ్యిందని పోలీసులు నిర్దారించుకున్నారు.
సార్ ఆరోజు ఏం జరిగిదంటే ?
వత్సల మొబైల్ ఫోన్ లోని డేటా పరిశీలించిన పోలీసులు అన్బును అదుపులోకి తీసుకున్నారు. తనకు వత్సలకు సంవత్సరం నుంచి అక్రమ సంబంధం ఉందని అన్బు అంగీకరించాడు. ఈనెల 7వ తేదీన వత్సలను నమ్మించి తాను వల్లిమలై కొండ మీద గుహలోకి తీసుకెళ్లానని అన్బు పోలీసులకు చెప్పాడు. ప్రతినిత్యం తనకు డబ్బులు ఇవ్వాలని, రెండో పెళ్లి చేసుకోవాలని వత్సల తనను పీడించిందని, ఆమె టార్చర్ ఎక్కువ కావడంతో పక్కాప్లాన్ తో గుహలోకి తీసుకెళ్లి చంపేశానని అన్బు అంగీకరించాడని వేలూరు పోలీసులు తెలిపారు.