lovers: యజమానితో ఉద్యోగం చేస్తున్న యువతి ?, 3 వేల అడుగుల ఎత్తులో ప్రియురాలితో, భార్య !
చెన్నై/తిరువణ్ణామలై: వివాహం చేసుకున్న వ్యక్తి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్న భర్త డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ లో కొందరు మగాళ్లు, కొందరు ఆడవాళ్లు పని చేస్తున్నారు. రాజకీయ నాయకులు, పలు సంఘాల నాయకులతో ఎక్కువ పరిచయాలు ఉన్న ప్రింటింగ్ ప్రెస్ యజమాని బాగా డబ్బులు సంపాధిస్తున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తున్న యువతితో యజమానికి చనువు ఏర్పడింది. ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరి అక్రమ సంబంధం గాఢంగా మారిపోయింది, నేను నిన్న రెండో పెళ్లి చేసుకుంటానని ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఆమెకు మాట ఇచ్చాడని తెలిసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం సమీపంలోని కొండ మీద మూడు వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని, అతని ప్రియురాలు అక్కడ కాలం గడిపారు. అయితే కొండమీద నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తోందని గమనించిన భక్తులు, పర్యాటకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి చూడగా ప్రింటింగ్ ప్రెస్ యజమాని, అతని ప్రియురాలు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, శవాలు రెండు కుళ్లిపోవడం వెలుగు చూసింది.
Video call: భార్య ప్రియుడికి ఆటైపులో వీడియో కాల్ చేసింది, భర్తకు తెలిసింది, భర్త దెబ్బకు భార్య!
ప్రముఖ పుణ్యక్షేత్రం
తమిళనాడులోని తిరువణ్ణాలమై జిల్లాలోని కలసపాక్కంలోని తెన్మతిమంగళంలో శ్రీపరువతమలై కొండ ఉంది. పరువతమలై కొండకు ప్రతినిత్య వేల సంఖ్యలో భక్తులు వచ్చి వెలుతుంటారు. పరువతమై కొండ ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కొండ మీదకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటుంటారు.
ప్రింటింగ్ ప్రెస్ యజమాని
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని మాడంబాక్కంలో నివాసం ఉంటున్న కాళిదాస్ కుమారుడు రాజశేఖరన్ సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని నడుపుతున్నాడు. వివాహం చేసుకున్న రాజశేఖరన్ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్న రాజశేఖరన్ డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు.
వ్యాపారం బాగా చేస్తున్నాడు
ప్రింటింగ్ ప్రెస్ లో కొందరు మగాళ్లు, కొందరు ఆడవాళ్లు పని చేస్తున్నారు. ఇదే ప్రింటింగ్ ప్రెస్ లో కాంచీపురం జిల్లాలోని పల్లికరఫై ప్రాంతంలో నివాసం ఉంటున్న దేవి (280 అనే యువతి పని చేస్తోంది, రాజకీయ నాయకులు, పలు సంఘాల నాయకులతో ఎక్కువ పరిచయాలు ఉన్న ప్రింటింగ్ ప్రెస్ యజమాని రాజశేఖరన్ బాగా డబ్బులు సంపాధిస్తున్నాడు.
ప్రింటింగ్ ప్రెస్ యజమానితో లింక్
ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తున్న దేవి అనే యువతికి ఇంకా వివాహం కాలేదు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని రాజశేఖరన్ కు, అక్కడ పని చేస్తున్న దేవికి చనువు ఏర్పడింది. ప్రింటింగ్ ప్రెస్ యజమాని రాజశేఖరన్ అక్కడ పని చేస్తున్న దేవితో కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.
మూడు వేల అడుగుల ఎత్తులో లవర్స్ ?
రాజశేఖరన్, దేవిల మధ్య అక్రమ సంబంధం గాఢంగా మారిపోయింది, నేను నిన్న రెండో పెళ్లి చేసుకుంటానని ప్రింటింగ్ ప్రెస్ యజమాని రాజశేఖరన్ అతని ప్రియురాలు దేవికి మాట ఇచ్చాడని తెలిసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణాలమై సమీపంలోని శ్రీపరువతమలై కొండ మీద మూడు వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని రాజశఏకరన్, అతని ప్రియురాలు దేవికి అక్కడ ఓ రోజు కాలం గడిపారు.
చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య
శ్రీపరువంతమై కొండమీద నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తోందని గమనించిన భక్తులు, పర్యాటకులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ట్రక్కింగ్ చేసే వారి సహాయంతో మూడు వేల అడుగుల ఎత్తులోకి వెళ్లి చూడగా అక్కడ ఓ వ్యక్తి, మరో మహిళ చెట్టుకు శవాలై కనిపించారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి జోబులో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డబ్బులు, కొన్ని పత్రాలు ఉన్న విషయం పోలీసులు గుర్తించారు.
Recommended Video
ఏం జరిగిందో ?, ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో
ప్రింటింగ్
ప్రెస్
యజమాని
రాజశేఖరన్,
అతని
ప్రియురాలు
దేవి
చెట్టుకు
ఉరి
వేసుకుని
ఆత్మహత్య
చేసుకోవడం,
శవాలు
రెండు
కుళ్లిపోవడం
వలనే
దుర్వాసన
వచ్చిందని
వెలుగు
చూసింది.
వేది
కనపడటం
లేదని
ఆమె
తండ్రి
ఇప్పటికే
స్థానిక
పోలీసులకు
ఫిర్యాదు
చేశాడని
వెలుగు
చూసింది.
అక్రమ
సంబంధం
కారణంగా
రాజశేఖరన్,
దేవి
ఆత్మహత్య
చేసుకున్నారా
?,
మరేమైనా
కారణాలు
ఉన్నాయా
?
అని
ఆరా
తీస్తున్నామని
తిరువణ్ణామలై
పోలీసులు
తెలిపారు.