Illegal affair: ప్రియుడిని ఇంట్లో పెట్టుకున్న అత్త, బెడ్ రూమ్ లో దూరి పొడిచిపారేసిన అల్లుడు !
చెన్నై: భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్య ఇంటి దగ్గరే ఉంటున్నది. కార్ల వ్యాపారం చేస్తున్న భర్త స్నేహితుడు ఇంటికి వచ్చి వెలుతుంటే అతనితో భార్యకు పరిచయం అయ్యింది. భర్తకు తెలీకుండా అతని స్నేహితుడితో భార్య ఎంజాయ్ చేసింది. చాలాకాలం సీక్రేట్ గా భార్య అక్రమ సంబందం సాగిపోయింది. గత ఏడాది కరోనా వైరస్ దెబ్బతో భర్త చనిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళతో ఆమె ప్రియుడు ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్న ప్రియుడు ఆమె కోరికలు అన్నీ తీరుస్తున్నాడు.
ఇదే సమయంలో తన అత్త ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని అల్లుడికి తెలిసింది. ఇదే విషయంలో అత్తతో గొడవ పెట్టుకున్నాడు. ఇంకోసారి నీ ప్రియుడు నీ ఇంటికి వస్తే నరికి చంపేస్తానని అల్లుడు ఆమె అత్తకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే అల్లుడి బెదిరింపులను ఆమె అత్త ఏమాత్రం పట్టించుకోలేదు. అనుకున్నట్లు అత్త ఇంట్లో ఆమె ప్రియుడు ఉన్నాడని తెలుసుకున్న అల్లుడు ఆమె ఇంటికి వెళ్లాడు. కత్తి తీసుకుని బెడ్ రూమ్ లో ఉన్న అత్త ప్రియుడి ముఖం మీద దారుణంగా పొడిచేశాడు. తీవ్రగాయాలైన ప్రియుడిని అతని ప్రియురాలు ఆసుపత్రికి తరలించింది. అయితే చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్లు ప్రియుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అత్త అక్రమ సంబంధం జీర్ణించుకోలేని ఆమె ప్రియుడిని అల్లుడు దారుణంగా హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
భర్త స్నేహితుడు ఎంట్రీతో ?
చెన్నైలోని కొరత్తూరులోని కామరాజు రోడ్డులో సెల్వా, రాణి (40) దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త సెల్వాతో సంతోషంగా కాపురం చేస్తున్న అతని భార్య రాణి ఇంటి దగ్గరే ఉంటున్నది. చెన్నైలోని కొరట్టూరులోని కైలాసనాథర్ కోవిల్ వీధిలో గోపి (34) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కార్ల వ్యాపారం చేస్తున్న గోపి, రాణి భర్త సెల్వా స్నేహితులు. సెల్వా ఇంటికి వచ్చి వెలుతున్న గోపి అతని భార్య రాణికి పరిచయం అయ్యింది.
కార్ల వ్యాపారం చేస్తున్నాడు
గోపి సెకండ్ హ్యాండ్ కార్లు, ఆటోలు, బైక్ లు కొనుగోలు చేసి తరువాత వాటిని ఇతరులకు విక్రయిస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. సెల్వా ఇంటికి గోపి ఎక్కువగా వెళ్లేవాడు. గోపికి ఇంకా వివాహం కాలేదు. ఆ సమయంలో భర్త సెల్వా స్నేహితుడు గోపి ఫ్రెండ్ భార్య రాణిని లైన్ లో పెట్టాడు. రాణి కూడా గోపికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఎంజాయ్ చేసిన భార్య.... చనిపోయిన భర్త
భర్త సెల్వాకు తెలీకుండా అతని రాణి భర్త స్నేహితుడు గోపితో ఎంజాయ్ చేసింది. చాలాకాలంగా సీక్రేట్ గా రాణి, గోపి అక్రమ సంబందం సాగిపోయింది. తన కోసం ఇంటికి వస్తున్నాడని సెల్వా అమాయకుడిలా గుడ్డిగా నమ్మాడు. గత ఏడాది చివరిలో కరోనా వైరస్ దెబ్బతో రాణి భర్త సెల్వా చనిపోయాడు. అప్పటి నుంచి రాణి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది,
డే అండ్ నైట్ రాణి ఇంట్లో ప్రియుడు
భర్త చనిపోయి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న రాణితో ఆమె ప్రియుడు గోపి మస్త్ మజా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్న ప్రియుడు గోపి అతని ప్రియురాలు రాణి కోరికలు అన్నీ తీరుస్తున్నాడు. ప్రియుడు గోపితో కలిసి రాణి బయట ఊర్లకు ట్రిప్పులు వేసి అతనితో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతూ వచ్చింది.
అత్త మ్యాటర్ తెలుసుకుని రిగిలిపోయిన అల్లుడు
రాణి అల్లుడు నందకుమార్ (22) కొరత్తూరులోని చావడి ఏరియాలోనే నివాసం ఉంటున్నాడు. రాణి అక్రమ సంబంధం విషయం అతని అల్లుడు నందకుమార్ కు తెలిసిపోయింది. మీ అత్త ఇంటికి కార్ల వ్యాపారి గోపి ఎప్పుడుపడితే అప్పుడు వచ్చి వెలుతున్నాడని నందకుమార్ కు అతని స్నేహితులు చెప్పారు. తన అత్త రాణి ఇంటికి ఆమె ప్రియుడు గోపిని పిలిపించుకుని ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్న అల్లుడు నందకుమార్ రగిలిపోయాడు.
డోంట్ కేర్ అని చెప్పిన అత్త
ఇదే విషయంలో నందకుమార్ అతని అత్త రాణితో గొడవ పెట్టుకున్నాడు. ఇంకోసారి నీ ప్రియుడు గోపి నీ ఇంటికి వస్తే నరికి చంపేస్తానని అల్లుడు నందకుమార్ ఆమె అత్త రాణికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే అల్లుడు నందకుమార్ బెదిరింపులను అతని అత్త రాణి ఏమాత్రం పట్టించుకోలేదు. అల్లుడు నందకుమార్ ను డోంట్ కేర్ అంటూ రాణి లెక్కలోకే తీసుకోలేదని సమాచారం.
అత్త ప్రియుడి ముఖం మీద కత్తితో పొడిచేసిన అల్లుడు
ఈనెల 22వ తేదీన గోపి అతని ప్రియురాలు రాణి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మద్యం సేవించిన గోపి అతని ప్రియురాలు రాణితో బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. తన అత్త రాణి ఇంట్లో ఆమె ప్రియుడు గోపి ఉన్నాడని తెలుసుకున్న అల్లుడు నందకుమార్ నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ నందకుమార్, గోపి మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో కత్తి తీసుకున్న నందకుమార్ బెడ్ రూమ్ లో ఉన్న అత్త రాణి ప్రియుడు గోపి ముఖం మీద దారుణంగా పొడిచేశాడు. తీవ్రగాయాలైన ప్రియుడు గోపిని అతని ప్రియురాలు రాణి 108 అంబులెన్స్ పలిపించి అతన్ని ఆసుపత్రికి తరలించింది.
ప్రియుడి ప్రాణం పోయింది..... అత్త ఎస్కేప్.... జైల్లో అల్లుడు
గోపి కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో పోలీసులు నందకుమార్ ను అరెస్టు చేశారు, ఆ రోజు నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపి ఆదివారం ప్రాణాలు వదిలేశాడు. ప్రియుడు గోపి అల్లుడు నందకుమార్ చేతిలో హత్యకు గురి కావడంతో అత్త రాణి మాయం అయ్యిందని పోలీసులు అంటున్నారు. అత్త రాణి అక్రమ సంబంధం జీర్ణించుకోలేని ఆమె అల్లుడు నందకుమార్ చేతిలో ప్రియుడు గోపి దారుణంగా హత్యకు గురి కావడం చెన్నైలో కలకలం రేపింది.