Illegal affair: లాడ్జ్ లో తల్లి ప్రియుడితో బీర్లు, బిర్యానీ పార్టీ, బెడ్ మీద ఎంజాయ్, పాప ఏడ్చిందని !
చెన్నై/ మదురై/ తిరునల్వేలి: వివాహిత మహిళ లాడ్జ్ లో ప్రియుడితో బీర్లు, బిర్యానీతో పార్టీ చేసుకుని బెడ్ మీద సరసాలు ఆడుతోంది. తల్లి మంచి రసపట్టులో ఉన్న సమయంలో 3 ఏళ్ల కుమార్తె ఆకలితో ఏడ్చింది. ఆ సమయంలో మాబాధ మేము పడుతుంటే మధ్యలో నీ రామయణం ఏమిటి అంటూ తల్లి, ప్రియుడు పసిబిడ్డ మీద దాడి చేశారు. రాసలీలలు పూర్తి అయిన తరువాత బిడ్డ చలనం లేకుండా పడి ఉన్న విషయం గుర్తించిన తల్లి, ఆమె ప్రియుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. అయితే అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిందని తెలుసుకున్న తల్లి, ఆమె ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకున్నారు. పసిబిడ్డ ప్రాణాలు తీసిన తల్లి, ఆమె ప్రియుడు కొన్ని గంటల్లోనే అడ్డంగా పోలీసులకు చిక్కిపోయారు.
TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !
ఎళిలరసికి భర్త, ఇద్దరు పిల్లలు
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా పరమకుడి ప్రాంతంలో మహేంద్రన్, ఎళిలరసి (28) దంపతులు నివాసం ఉంటున్నారు. మహేంద్రన్, ఎళిలరసి దంపతులకు సెల్వకుమార్ (5) అనే కుమారుడు, మనుశ్రీ (3) అనే కుమార్తె ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మహేంద్రన్ మరణించాడు.
ఫోన్ లో టచ్ లోకి వచ్చిన రాందాస్
భర్త మహేంద్రన్ చనిపోయిన తరువాత ఎళిలరసి ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. కొన్ని నెలల క్రితం ఫోన్ లో మిస్ డ్ కాల్ చూసిన ఎళిలరసి ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసింది. ఆ రోజు తిరునల్వేలి జిల్లా సెంగం ప్రాంతానికి చెందిన రాందాస్ అనే యువకుడు ఎళిలరసికి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఎళిలరసి, రాందాస్ నిత్యం ఫోన్ లో టచ్ లో ఉన్నారు.
సింగం రాందాస్
సెంగం ప్రాంతానికి చెందిన రాందాస్ రానురాను ఎళిలరసికి సింగంలా కనిపించాడు. అప్పుడప్పుడు రాందాస్ ప్రియురాలు ఎళిలరసితో ఎంజాయ్ చెయ్యడానికి బయటి ప్రాంతాల్లోని లాడ్జ్ లు, స్నేహితుడి రూమ్ లకు వెలుతున్నాడు. అప్పటి నుంచి రాందాస్, ఎళిలరసి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.
లాడ్జ్ లో కింద బిడ్డ, బెడ్ మీద కామాంధులు
ఎళిలరసి మూడేళ్ల కుమార్తె మనుశ్రీని వెంట తీసుకుని ప్రియుడు రాందాస్ తో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లింది. నాగపట్టణంలోని వేలంగన్ని ప్రాంతంలోని ఓ లాడ్జ్ లో రాందాస్ రూమ్ తీసుకున్నాడు. లాడ్జ్ లోని రూమ్ లోకి వెళ్లిన ఎళిలరసి ఆమె మూడేళ్ల చిన్నారిని నేల మీద దుప్పటి వేసి దానిమీద పడుకోబెట్టింది. లాడ్జ్ లోని డబుల్ కాట్ బెడ్ మీద ప్రియుడు రాందాస్ తో కలిసి ఎళిలరసి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.
ప్రియుడితో బీర్లు, బిర్యానీ పార్టీ
ప్రియుడు రాందాస్ తో కలిసి పీకలదాక బీర్లు తాగి బిర్యానీ లాగించిన ఎళిలరసి బెడ్ మీద ఎంజాయ్ చేస్తూ కన్నకూతురు మనుశ్రీ విషయం మరిచిపోయింది. అప్పటి వరకు నిద్రపోతున్న మనుశ్రీ నిద్రలేచి ఆకలితో ఏడ్చింది. మంచి రసపట్టులో ఉన్న సమయంలో నీ రామయణం ఏమిటి అంటూ తల్లి ఎళిలరసి, ఆమె ప్రియుడు రాందాస్ మనుశ్రీ మీద దాడి చేశాడు. తన కుమార్తె మనుశ్రీ మీద ప్రియుడు రాందాస్ పదేపదే దాడి చేస్తుంటే ఎళిలరసి కనీసం అడ్డుకూడా చెప్పలేదు.
Recommended Video
ఆసుపత్రిలో ఎస్కేప్
దెబ్బలు బాగా తగలడంతో మనుశ్రీ స్పృహ కోల్పోయింది. ఆందోళన చెందిన ఎళిలరసి, రాందాస్ పాపను తీసుకుని వేలంగాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి బిడ్డకు అనారోగ్యంగా ఉందని నాటకాలుఆడారు. అప్పటికే మనుశ్రీ చనిపోయిందని వైద్యులు చెప్పారు. పాప చనిపోయిందని తెలుసుకున్న రాందాస్, ఎళిలరసి శవాన్ని ఆసుపత్రిలో వదిలి పరారైనారు. చిన్నారి శవాన్ని వదిలి పారిపోయారని గుర్తించి ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. లాడ్జ్ ఖాళీ చేసిన ఎళిలరసి, రాందాస్ పారిపోవడానికి బస్ స్టాండ్ లో బస్సు కోసం వేచి ఉన్న సమయంలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. రాసలీలల సమయంలో మనుశ్రీ ఏడ్చిందని, దాడి చేస్తే ప్రాణాలు వదిలిందని రాందాస్, ఎళిలరసి నేరం అంగీకరించారని వేలంగన్ని పోలీసులు తెలిపారు.