Illegal affair: కొడుకు ఫ్రెండ్ తో ఆంటీ మస్త్ మజా, అసలే పండ్లు, భర్తుకు తెలిసిపోయి !
చెన్నై/దిండుగల్: కొడుకు వయసు ఉన్న కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ కన్నుమిన్ను కనపడకుండా అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఇంటికి వెళ్లేదారిలోనే ప్రియుడితో ఎంజాయ్ చేసిన తరువాత ఆమె ఇంటికి వెళ్లేది. రానురాను ప్రియుడినే ఇంటికి పిలిపించుకుని జల్సా చేసేది. మజా చేస్తున్న సమయంలో భార్యతో ఆమె ప్రియుడు అడ్డంగా మొగుడికి చిక్కిపోయారు. భార్య, ఆమె ప్రియుడిని భర్త చితకబాదేశాడు. భర్త బతికుంటే మళ్లీ మనం కష్టాలు వస్తాయని భయపడిన భార్య, ఆమె ప్రియుడు కలిసి పక్కాప్లాన్ తో భర్తను చంపేసి పాడుబడిన బావిలో శవం విసిరేసి చేతులు దులుపేసుకున్నారు.
Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!
దేవి పండ్ల వ్యాపారం
తమిళనాడులోని దిండుగల్ జిల్లా పళని సమీపంలోని కీరనూర్ ప్రాంతంలో దండపాణి (37), దేవి (34) దంపతులు నివాసం ఉంటున్నారు. దండపాణి, దేవి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం తారాపురం చేరుకుంటున్న దండపాణి, దేవి దంపతులు అక్కడ పండ్ల వ్యాపారం చేసుకుని రాత్రి ఒకేసారి ఇద్దరూ మళ్లీ కీరనూరు చేరుకుంటున్నారు.
మా ఆయన ఊరికివెళ్లాడు
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు రాత్రి దేవి మాత్రమే తారాపురం నుంచి ఒంటరిగా కీరనూరుకు వెళ్లింది. దండపాణి ఎక్కడ అంటూ చుట్టుపక్కలవాళ్లు, బంధువులు దేవిని ప్రశ్నించారు. తన భర్త దండపాణి పని మీద దిండుగల్ వెళ్లాడని, రెండు రోజుల తరువాత వస్తానని చెప్పి వెళ్లాడని దేవి అందరినీ నమ్మించింది.
నా మొగుడు కనిపించడం లేదు
రెండు
రోజుల
తరువాత
దేవి
కీరనూరు
పోలీస్
స్టేషన్
చేరుకుని
తన
భర్త
దండపాణి
ఊరికి
వెళ్లి
వస్తానని
చెప్పి
తరువాత
ఇంటికి
రాలేదని
పోలీసులకు
ఫిర్యాదు
చేసింది.
భర్త
కనపడలేదని
ఫిర్యాదు
చేసిన
భార్య
దేవి
మీద
మొదటి
నుంచి
పోలీసులకు
అనుమానం
ఉంది.
దండపాణి
కోసం
వెతకడం
మానేసిన
పోలీసులు
దేవి
మీద
నిఘా
వెయ్యడంతో
అసలు
విషయం
బయటకు
వచ్చింది.
కొడుకు వయసు ప్రియుడు
కీరనూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న అభిషేక్ (19) అనే యువకుడు దేవి కొడుకు స్నేహితుడు. అభిషేక్ ఆంటీ దేవికి దగ్గర అయ్యాడు. అభిషేక్ కూడా ప్రతిరోజూ తారాపురం నుంచి కీరనూరు వెళ్లి వస్తుంటాడు. భర్త దండపాణి రాత్రి ఇంటికి రావడం ఆలస్యం అయితే ఆ రోజు అభిషేక్ తో కలిసి దేవి కీరనూరు బయలుదేరేది. ఆ సమయంలో అభిషేక్ ఆంటీ వలలో పడిపోయాడు.
మార్గం మధ్యలో మస్త్ మజా
తారాపురం నుంచి నేరుగా కీరనూరులోని ఇంటికి వెళ్లకుండా దేవి కొడుకు వయసు ఉన్న అబిషేక్ తో ఎంజాయ్ చేసి తరువాత ఇంటికి వెళ్లేది. కొంతకాలం నుంచి దేవి ఆంటీతో అభిషేక్ మస్త్ మజా చేస్తూ వచ్చాడు. దేవి, అభిషేక్ ల అక్రమ సంబంధం విషయం భర్త దండపాణికి తెలిసిపోయింది.
భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన పెళ్లాం
తాను పనిమీద బయటకు వెలుతున్నానని, నువ్వు ఇంటికి వెళ్లాలని దండపాణి భార్య దేవికి చెప్పాడు. భర్త ఊరికి వెలుతున్నాడని పొరబడిన దేవి ప్రియుడు అభిషేక్ తో కలిసి ఇంటికి బయలుదేరింది. ఎప్పటిలాగే మార్గం మధ్యలో మస్త్ మజా చేస్తున్న సమయంలో భర్త దండపాణి అతని భార్య దేవి, ఆమె ప్రియుడు అభిషేక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.
భర్తను పక్లాప్లాన్ తో చంపేసిన ఆంటీ
భార్య దేవితో ఎంజాయ్ చేస్తున్న అభిషేక్ ను పట్టుకున్న దండపాణి అతన్ని చికతబాదేశాడు. ఆ సమయంలో గొడవ పెద్దది అయితే కష్టం అవుతోందని భావించిన దేవి భర్తను దండపాణి వెనుక నుంచి గట్టిగా పట్టుకుంది. అదే సమయంలో అభిషేక్ కత్తి తీసుకుని ఆంటీ దేవి భర్త దండపాణిని ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేశారు.
ఏం స్కెచ్ వేశారంటే ?
దండపాణి ముఖానికి కవర్ చుట్టేసిన దేవి, ఆమె ప్రియుడు అతని శవాన్ని పాడుపడిన బావిలో విసిరేసి చేతులు దులుపేసుకున్నారు. తన భర్త ఊరికి వెళ్లి కనపడటం లేదని తప్పుడు కేసు పెట్టిన దేవి ఆంటీ, ఆమె ప్రియుడు అభిషేక్ ఇప్పుడు అడ్డంగా పోలీసులకు చిక్కిపోవడం కలకలం రేపింది.