Khiladi wife: ప్రియుడి మోజులో, 11 ఏళ్లు చిన్నోడు, భర్త హత్యకు రూ. 6 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చిన ఆంటీ !
న్యూఢిల్లీ: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. భర్త సొంతంగా వర్క్ షాప్ పెట్టుకుని పనివాళ్లతో పని చేయిస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. ఇటీవల బైక్ లో ఇంటికి వెలుతున్న భర్తను రివాల్వర్ తో కాల్చి చంపేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. నిద్యం రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య జరగడంతో పోలీసులు 500 సీసీటీవీలు పరిశీలించారు. క్లైమాక్స్ లో పోలీసులు హత్యకు గురైన వ్యక్తి భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. 25 ఏళ్లు భర్తతో కాపురం చేసిన భార్య రూ. 6 లక్షలు కిరాయి ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని వెలుగు చూడటం కలకలం రేపింది.
Illegal affair: పెళ్లికి ముందే ఆంటీతో అక్రమ సంబంధం, కొడుకు ముందే భార్యను చంపేసి !
25 ఏళ్ల క్రితం పెళ్లి
ఢిల్లీలోని ధర్యాగంజ్ ప్రాంతంలో మొయినుద్దీన్ అలియాస్ మెయిన్ (47) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 ఏళ్ల క్రితం జీబా ఖురేషీ అలియాస్ జీబా (40) అనే మహిళను మొయినుద్దీన్ పెళ్లి చేసుకున్నాడు. మొయినుద్దీన్, జీబా దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
దంపతుల మద్య గొడవలు
వివాహం జరిగిన 20 ఏళ్ల వరకు మొయినుద్దీన్, జీబా దంపతులు చాలా సంతోషంగా జీవించారు. మొయినుద్దీన్ దర్యాగంజ్ ప్రాంతంలో సొంతంగా వర్క్ షాప్ పెట్టుకుని పనివాళ్లతో పని చేయిస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. రెండు సంవత్సరాల నుంచి భార్య జీబా ప్రతినిత్యం ఆమె భర్త మొయినుద్దీన్ తో గొడవలు పడుతోందని సమాచారం.
టచ్ లో ప్రియుడు
రెండు సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ లో జీబాకు మీరట్ కు చెందిన షోయబ్ (29) అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం సోషల్ మీడియాలో టచ్ లో ఉన్న షోయబ్, జీబా తరువాత నేరుగా కలుసుకున్నారు. కొన్ని నెలల స్నేహితులుగా ఉన్న షోయబ్, జీబా తరువాత నేరుగా కలుసుకుని అక్రమ సంబంధం పెట్టుకుని శారీరకంగా కలుస్తున్నారు.
భర్తను చంపేసి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని స్కెచ్
రానురాను మొయినుద్దీన్ భార్య జీబా ఆమె ప్రియుడు షోయబ్ మాయలో పడిపోయింది. నా భర్త మొయినుద్దీన్ ను చంపేసి మనం పెళ్లి చేసుకుందామని జీబా ఆమె ప్రియుడు షోయబ్ మీద ఒత్తిడి చేసింది. ప్రియురాలు జీబాను హత్య చెయ్యాలని షోయబ్ డిసైడ్ అయ్యాడు. మొయినుద్దీన్ ను హత్య చెయ్యడానికి షోయబ్ కాంట్రాక్టు కిల్లర్ వినిత్ గోస్వామి అనే వ్యక్తితో డీల్ మాట్లాడాడు.
భర్త హత్యకు రూ. 6 లక్షలు డీల్
మొయినుద్దీన్ ను హత్య చెయ్యడానికి జీబా, ఆమె ప్రియుడు షోయబ్ కలిసి కాంట్రాక్ట్ కిల్లర్ వినిత్ గోస్వామితో రూ. 6 లక్షలు డీల్ మాట్లాడుకున్నారు. మొయినుద్దీన్ రోజు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో తిరుతుంటాడని, హత్య చెయ్యడానికి తనకు ఎవరైనా సహాయం చెయ్యాలని వినిత్ గోస్వామి షోయబ్ కు చెప్పాడు.
ప్రియురాలి భర్తను చంపించిన ప్రియుడు
ప్రియురాలు జీబా భర్త మొయినుద్దీన్ ను హత్య చెయ్యడానికి వినిత్ గోస్వామికి సహాయం చెయ్యడానికి షోయబ్ స్వయంగా రంగంలోకి దిగాడు. మే 17వ తేదీన మొయినుద్దీన్ బైక్ లో వెలుతున్న సమయంలో మరో బైక్ లో వెళ్లిన షోయబ్, వినిత్ గోస్వామి రివాల్వర్ తో మొయినుద్దీన్ ను కాల్చి చంపేసి అక్కడి నుంచి పరారైనారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు.
500 సీసీటీవీ కెమెరాలు, 100 మంది విచారణ
మొయినుద్దీన్ హత్యకు గురైన దర్యాగంజ్ ప్రాంతంలో 500 సీసీటీవీలు పరిశీలించి, 100 మందిని విచారణ చేసి మొయినుద్దీన్ హత్య కేసులో అతని భార్య జీబా, ఆమె ప్రియుడు షోయబ్, కాంట్రాక్టు కిల్లర్ వినిత్ గోస్వామిని అరెస్టు చేశామని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ మీడియాకు చెప్పారు. మీరట్ కు చెందిన వ్యాపారి షోయబ్ మీద ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయని, తన కంటే వయసులో 11 ఏళ్లు చిన్నవాడైన షోయబ్ మాయలో పడిన జీబా ఆమె భర్తను హత్య చేయించిందని ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ మీడియాకు చెప్పారు.