Illegal affair: ఫేస్ బుక్ ప్రియుడు, భర్త లేనిలోటు, ప్రియుడితో ఆంటీ ఎంజాయ్, ఖాజా తినిపించాడు !
చెన్నై/ కోయంబత్తూరు: భర్త అనారోగ్యంతో మరణించడంతో 13 ఏళ్ల కుమారుడితో కలిసి భవనేశ్వరి ఒంటరిగా నివాసం ఉంటోంది. భువనేశ్వరికి ఫేస్ బుక్ లో ఖజా అనే యువకుడు పరిచయం అయ్యాడు. భువనేశ్వరి, ఖాజా పరిచయం అక్రమ సంబంధానికి దారి తియ్యడంతో ఇద్దరూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. భువనేశ్వరిని అడిగే దిక్కులేకపోవడంతో ఆమె ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది. ఇదే సమయంలో ఖాజా ఆంటీ భువనేశ్వరికి కాకినాడ కాజా తినిపించి ఆమెను దూరం పెట్టేశాడు. భువనేశ్వరి ఖాజాకు దగ్గర కావడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది. అంతే సహనం కోల్పోయిన భవనేశ్వరి 'నాతో మాట్లాడవా ?, నేను నీకు బోరుకొట్టానా ?, నువ్వు సుఖంగా ఉంటావా ? చూద్దాం' అంటూ వాట్సాప్ లో మెసేజ్ పంపించి కన్న కొడుకును దిక్కులేని వాడిని చేసి ఆత్మహత్య చేసుకుంది.
Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!
పొల్లాచ్చిలో భర్త, కొడుకు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలోని కేఎల్ఎస్ నగర్ లో భువనేశ్వరి, మురగేశన్ అనే దంపతులు నివాసం ఉండే వారు. మురగేశన్, భువనేశ్వరి దంపతులకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి జరిగిన తరువాత భువనేశ్వరి భర్త మురగేశన్ తో కాపురం చేస్తూ కొడుకును చూసుకుంటూ చాలా సంతోషంగా గడిపింది.
భర్త చనిపోవడంతో ఫేస్ బుక్ లో ఖాజా ఎంట్రీ
గత నాలుగు సంవత్సరాల నుంచి మురగేశన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యం తిరగపడటంతో భువనేశ్వరి భర్త మురగేశన్ మరణించాడు. తరువాత భువనేశ్వరి కొడుకుతో కలిసి ఒంటరిగా నివాసం ఉంటున్నది. ఆ సమయంలో ఫేస్ బుక్ లో ఖాజా మోయిద్దీన్ అనే యువకుడు భువనేశ్వరికి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కొంతకాలం సోషల్ మీడియాలో గంటలు గంటలు టచ్ లో ఉన్నారు.
భర్తలేని లోటుతో ఆనందం..... అంతకంటే సుఖం
భువనేశ్వరి, ఖాజాల పరిచయం రానురాను అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త మురగేశన్ చనిపోవడం, పుట్టింటి వాళ్లు నెలకో రెండు నెలలకో ఒకసారి వచ్చి వెలుతుండటంతో భువనేశ్వరికి అడ్డుఅదుపు లేకుండాపోయింది. ప్రియుడు ఖాజాతో కలిసి భువనేశ్వరి పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భర్త లేనిలోటు, భర్త దూరం అయినా ఖాజా వలన పడక సుఖం ఉండటంతో భువనేశ్వరి అతనికి పూర్తిగా దాసోహం అయిపోయింది.
బలవంతంగా ఇంటికి పిలిపించుకుని ?
రెండు సంవత్సరాల పాటు ఆంటీ భువనేశ్వరితో ఎంజాయ్ చేసిన ఖాజా రానురాను ఆమెకు దూరం కావడానికి ప్రయత్నించాడు. అయితే భువనేశ్వరి మాత్రం ప్రియుడు ఖాజాను మాత్రం వదిలిపెట్టలేదు. పదేపదే ఫోన్లు చేసి ఖాజాను ఇంటికి పిలిపించుకుని అతనితో రాసలీలలు సాగించింది. కొంతకాలం క్రితం ఖాజా ప్రియురాలు భువనేశ్వరి అంటేనా భయపడిపోయాడు.
ఆంటీకి కాకినాడ కాజా తినిపించిన ఖాజా
భువనేశ్వరి ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఖాజా ఆమెకు కనపడకుండా తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. తన ఫోన్ నెంబర్ తో ఫోన్ చేస్తే ఖాజా చిక్కడం లేదని భువనేశ్వరి ఆమె స్నేహితుల ఫోన్ నెంబర్ల నుంచి ఖాజాకు ఫోన్ చేసింది. అయితే ఫోన్ చేస్తోంది భువనేశ్వరి అనే అనుమానంతో ఖాజా తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్లును రిసివ్ చెయ్యడం మానేశాడు.
నాతో మాట్లాడవా ? నువ్వు సుఖంగా ఉంటావా
నెల రోజుల నుంచి ఖాజా కనిపించకపోవడం, అతను ఫోన్ లో అందుబాటులోకి రాకపోవడంతో భువనేశ్వరి జీవితంపై విరక్తి పెంచుకుంది. చివరికి ఖాజా ఫోన్ నెంబర్ కు వాట్సాప్ లో నువ్వు నాతో మాట్లాడవా ?, నాకు దూరం అవుతావా ?, నేను అంటే నీకు మోజు తీరిపోయిందా ?, నువ్వు సుఖంగా ఉంటావా ? అంటూ మెసేజ్ పంపించింది. అంతే వాట్సాప్ లో మెసేజ్ పంపించిన రెండు గంటల తరువాత భువనేశ్వరి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఖాజా కోసం గాలిస్తున్నారు. తండ్రి అనారోగ్యంతో మరణించడం, తల్లి భువనేశ్వరి ప్రియుడి వ్యామోహంలో ఆత్మహత్య చేసుకోవడంతో 13 ఏళ్ల కొడుకు జీవితం రోడ్డనపడింది.