ప్రేమ పెళ్లి, అక్రమ సంబంధం, సూటిపోటి మాట్లతో కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య!
బెంగళూరు: అక్రమ సంబంధం కారణంగా గ్రామస్తుల సూటిపోటి మాట్లతో జీవితంపై విరక్తిచెందిన మహిళ కుమార్తెను హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో జరిగింది. మైసూరు జిల్లా హెచ్.డి. కోటే తాలుకా, కూడగి గ్రామంలో నివాసం ఉంటున్న రాజేశ్వరి (23) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.
కూడగి గ్రామంలో నివాసం ఉంటున్న సోమన్న, అదే గ్రామం సమీపంలోని కుర్నేగాల గ్రామం నివాసం ఉంటున్న రాజేశ్వరి, సోమన్న ప్రేమించుకున్నారు. ఆరు సంవత్సరాల క్రితం సోమన్న, రాజేశ్వరి కుటుంబ సభ్యులను ఎదరించి వివాహం చేసుకున్నారు.
సోమన్న, రాజేశ్వరి దంపతులకు కుమారుడు, మాన్వితా (2), అనే కుమార్తె ఉంది. రాజేశ్వరి అదే గ్రామంలో నివాసం ఉంటున్న వినోద్ అనే వ్యక్తితో రెండు సంవత్సరా క్రితం నుంచి అక్రమ సంబంధం సాగించింది. విషయం తెలుసుకున్న సోమన్న భార్య రాజేశ్వరిని గట్టిగా హెచ్చరించాడు.
బిడ్డల భవిష్యత్తు చూసుకోవాలని, అక్రమ సంబంధం మానుకోవాలని భార్య రాజేశ్వరికి నచ్చచెప్పాడు. అయితే రాజేశ్వరిలో ఎలాంటి మార్పురాలేదు. పెద్దలు పంచాయితీ చేసి రాజేశ్వరికి బుద్దిమాటలు చెప్పినా ఆమె వినోద్ తో కలిసి తిరిగడం మానుకోలేదు.
ఇక లాభం లేదని నిర్ణయించిన సోమన్న భార్య రాజేశ్వరిని పిలుచుకుని వెళ్లి ఆమె పుట్టింటిలో వదిలిపెట్టి వచ్చాడు. అక్రమ సంబంధం కారణంగానే నిన్ను పుట్టింటిలో వదిలిపెట్టారని సాటి మహిళలు సూటిపోటి మాట్లతో తిట్టడంతో భరించలేని రాజేశ్వరి ఇంటిలో ఎవరులేని సమయంలో కుమార్తె మాన్వితాకు ఉరి వేసి హత్య చేసి ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన రాజేశ్వరి కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.