రూ. వేల కోట్ల ఐఎంఎ చీటింగ్ కేసు: దుబై నుంచి వీడియో విడుదల, నన్ను చంపేస్తారు, సీబీఐ !
బెంగళూరు: బెంగళూరు ఐఎంఎ జ్యెవెలర్స్ వేల కోట్ల రూపాయల చీటింగ్ కేసు వ్యవహారంలో ఆ సంస్థ యజమాని మన్సూర్ ఆలీ ఖాన్ అలియాస్ మన్సూర్ ఖాన్ దుబాయ్ నుంచి ఓ వీడియో విడుదల చేశాడు. ఐఎంఎ సంస్థ నాశనం కావడానికి తన మతానికి చెందిన కొందరు రాజకీయ నాయకులే కారణం అని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని మన్సూర్ ఖాన్ వీడియో విడుదల చేశాడు.
Recommended Video
పాస్ పోర్టు సీజ్
తాను జూన్ 14వ తేదీ బెంగళూరు తిరిగి రావలసి ఉందని, అయితే తన పాస్ పోర్టు సీజ్ చెయ్యడంతో రాలేకపోయానని మన్సూర్ ఖాన్ తెలిపాడు. తాను నమ్ముకున్న కొందరు ముస్లీం పెద్దలు, రాజకీయ నాయకులు తన ఐఎంఎ సంస్థ నాశనం కావడానికి కారణం అయ్యారని మన్సూర్ ఖాన్ ఆరోపించాడు.
21 వేల ఫ్యామిలీలు
తాను కచ్చితంగా బెంగళూరు వస్తానని, ఐఎంఎ సంస్థకు చెందిన 21 వేల మంది కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తానని మన్సూర్ ఖాన్ వివరించాడు. తాను బెంగళూరు వస్తే తన మీద పగ పెంచుకున్న వారు కచ్చితంగా చంపేస్తారని, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని మన్సూర్ ఖాన్ మనవి చేశాడు.
ఐఏఎస్ కు రూ. 10 కోట్లు
ఐఎంఎ చీటింగ్ కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని, విచారణలో తాను ఈ స్థితికి రావడానికి కారణం అయిన అందరి పేర్లు బయటకు వస్తాయని మన్సూర్ ఖాన్ అంటున్నాడు. ఐఎంఎ సంస్థకు అనుకూలంగా ఓ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒక ఐఏఎస్ అధికారికి రూ. 10 కోట్లు ఇచ్చానని మన్సూర్ ఖాన్ ఆరోపించాడు. అయితే ఐఏఎస్ అధికారి పేరు మాత్రం మన్సూర్ ఖాన్ బయటకు చెప్పలేదు.
జేడీఎస్ ఎమ్మెల్సీ
జేడీఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కర్ణాటక జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరవణ మీద మన్సూర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై శరవణ మాట్లాడుతూ తనకు మన్సూర్ ఖాన్ కు పరిచయం లేదని, ఒక్కసారి కూడ అతన్ని చూడలేదని అన్నారు. తన మీద లేనిపోని ఆరోపణలు చేసిన మన్సూర్ ఆలీ ఖాన్ ఎందుకు అలా చేశాడో తెలీదని శరవణ అంటున్నారు.
మొబైల్ నెంబర్
తన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు తాను ఎవ్వరికి మోసం చెయ్యనని మన్సూర్ ఖాన్ అంటున్నాడు. తన మొబైల్ నెంబర్ 99021 29090లో అందుబాటులో ఉన్నానని, భాదితులు ఆ నెంబర్ కు ఎస్ఎంఎస్ చేసి సంప్రధించాలని మన్సూర్ ఖాన్ మనవి చేశాడు.
రూ. 4 వేల కోట్లు చీటింగ్ !
తాను రూ. 4 వేల కోట్లు చీటింగ్ చేశానని ఆరోపణలు వస్తున్నాయని, అన్ని వేల కోట్లు తాను మోసం చెయ్యలేదని మన్సూర్ ఖాన్ అంటున్నాడు. తన దగ్గర రూ. 1, 300 కోట్ల ఆస్తులు ఉన్నాయని, తప్పకుండా అందరికీ న్యాయం చేస్తానని మన్సూర్ ఖాన్ అంటున్నాడు. దుబై నుంచి మన్సూర్ ఖాన్ 15 నిమిషాల వీడియో విడుదల చెయ్యడంతో దానిని పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.