ప్రధాని మోడి స్పూర్తి తోనే రాజకీయ అరంగేట్రం చేశా. రివాభ జడేజా
మోడి స్పూర్తి తో నే నేను రాజకీయాల్లోకి వచ్చానని ఇటివలే బిజేపిలో చేరిన ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాభ జడేజా అన్నారు..మోడి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని ఆయన ఆశయాలు ,స్పూర్తితోనే తాను రాజకీయాల్లో చేరారని చెప్పారు.మోడి కేవలం ఒక్కసారి మాత్రమే కలిసి స్పూర్తి పోందానని అందుకే పార్టీలో చేరానని చెప్పారు.
బీజేపీ నేతలకు కోట్లు ఇచ్చినట్టు యడ్యూరప్ప డైరీ, విచారణకు కాంగ్రెస్ డిమాండ్, తోసిపుచ్చిన యడ్డీ
మోడిని మాములుగా కలిశా,
మాములుగా గత నవంబర్ లో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తున్న నేపథ్యంలో భర్త రవీంద్ర జడేజా తో కలిసి మోదితో్ సమావేశం అయ్యామని ఆమే తెలిపారు..అప్పుడు మోదీ చాల మంచి విషయాలు చెప్పారని ,ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించారని అన్నారు.కాసేపు క్రికెట్ గురించి కూడ మాట్లాడుకున్నామని అన్నారు.
మంచి జరగాలంటే ప్రత్యక్షంగా పాల్గోనాలి.
ఇక ఒక సంధర్భంలో రాజకీయ పరిస్థితులపై విమర్శిస్తున్న వారి వద్దకు వెళ్లిన మోడి ,అతను చాల చిన్న వాడినని ఎన్నికల్లో టికెట్ వచ్చి గెలిపోందితే చాల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారని అన్నారు..మనకు ఏదైన మంచి జరగాలంటే అందులో నువ్వు పాల్గోనాలి, లేదంటే నీకు రాజకీయాలను విమర్శించే నైతిక హక్కు లేదంటూ మోది చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో ఆకర్షించాయని చెప్పారు. ఆ మాటలతోనే తాను రాజకీయాల్లోకి రావాలకున్నట్టు చెప్పారు.
ఆజామ్ నగర్ పోటి
ఇటీవలే బీజేపీ పార్టీలో చేరిన ఆమె గుజరాత్లోని జామ్ నగర్ నుంచి సీటు ఆశిస్తున్నారు. కాగా ఇదే నియోజకవర్గం నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పటిదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ని బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనితో అందరి దృష్టి ఈ నియోజకవర్గం పైనే ఉంది.
కర్ణిసేన విభాగం మహిళా అధ్యక్షురాలు
గుజరాత్లోని కర్ణిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా రివాభా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. క్షత్రియ వర్గీయురాలైన ఆమె ఇటీవల కర్ణిసేన మద్దతుతో బీజేపీ పార్టీలో చేరారు. జామ్నగర్లో ప్రస్తుతం భాజపా నాయకురాలు పూనమ్ మాదమ్ ఎంపీగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూనమ్.. ప్రముఖ కాంగ్రెస్ నేత, తన బంధువైన విక్రమ్ మాదమ్పై విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించింది. గుజరాత్లో మొత్తం 26 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా బలమైన నాయకులను బరిలోకి దింపి 2014 ఫలితాలను పునరావృతం చేయాలని గుజరాత్ బీజేపీ భావిస్తోంది.