సంచలనం: 'నీ భార్యను అమ్మి.. మరుగుదొడ్డి కట్టు..': జిల్లా మేజిస్ట్రేట్ వివాదాస్పద వ్యాఖ్యలు
స్వచ్ఛ భారత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్(డీఎమ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మరుగుదొడ్డి నిర్మించడానికి డబ్బు లేకపోతే నీ భార్యను అమ్ముకో,
పాట్నా: స్వచ్ఛ భారత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్(డీఎమ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన జిల్లా మేజిస్ట్రేట్ కన్వాల్ తనూజ్.. జామ్ హార్ గ్రామస్ధులతో సమావేశమయ్యారు.
ప్రతి ఒక్కరూ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. మరుగుదొడ్డి లేకపోతే కలిగే నష్టాలను గురించి వారికి వివరించారు. ఇంతలో ఓ గ్రామస్ధుడు లేచి మరుగుదొడ్డి నిర్మించడానికి డబ్బు లేదని చెప్పాడు.
#WATCH Aurangabad's DM Kanwal Tanuj says, " go sell your wife" to a person while addressing a public gathering on cleanliness (22.07) #Bihar pic.twitter.com/kqkQpVdC1q
— ANI (@ANI_news) July 23, 2017
దానికి స్పందించిన కన్వాల్.. 'డబ్బు లేకపోతే నీ భార్యను అమ్ముకో, ఆ డబ్బుతో మరుగుదొడ్డి నిర్మించుకో..' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అందరికీ చెబుతున్నా వినండి.. మీ భార్యల గౌరవం కాపాడుకోవాలంటే మరుగుదొడ్డి తప్పక నిర్మించుకోవాలి. మీ భార్యల విలువ రూ.12 వేలు కన్నా తక్కువని అనుకుంటే మరుగుదొడ్డిని నిర్మించుకోవద్దు లేదా మరుగుదొడ్డి నిర్మించుకోండి..' అని జిల్లా మేజిస్ట్రేట్ కన్వాల్ తనూజ్వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ముందుగా డబ్బు మంజూరు చేస్తే.. వాటిని వేరే అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని ఆయన అన్నారు. మేజిస్ట్రేట్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సమావేశ స్ధలంలో గంభీర వాతావరణం ఏర్పడింది. ఆయన మాటతీరు, పద్దతి సరిగా లేవంటూ గ్రామస్ధులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.