అంధురాలిపై గ్యాంగ్రేప్: గొంతు ఆధారంగా అరెస్ట్
న్యూఢిల్లీ: అత్యాచారానికి పాల్పడిన నిందితుడి గొంతు ఆధారంగా బాధితురాలు గుర్తించింది. 20 ఏళ్ళ అంధురాలైన యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ అత్యాచారానికి గురైన బాధితురాలు అంధురాలు కావడంతో నిందిుతులు తమను గుర్తించే అవకాశం లేదని భావించారు. అయితే నిందితుడి గొంతు ఆధారంగా గుర్తించింది.
సెంట్రల్ ఢిల్లీలోని దేశ్బంధు గుప్తా రోడ్లో లైంగిక దాడికి గురైన 20 ఏళ్ళ అంధురాలైన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్నారు.
ఈ నెల 4వ తేదిన యువతి తల్లి నీళ్ళు పట్టేందుకు బయటకు వెళ్ళింది. అయితే అదే అదనుగా చూసిన ఇద్దరు వ్యక్తులు అంధురాలిని ఆమె ఇంటి నుండి బలవంతంగా పొరుగునే ఉన్న మరో ఇంట్లోకి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు.ముగ్గురు నిందితులు ఆ యువతిపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కౌన్సెలింగ్ కోసం స్వచ్ఛంద సంస్థకు తరలించారు. పదేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో ఆమె కన్ను దెబ్బతిందని పోలీసులు తెలిపారు. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో రోజుకు ఐదుగురికి పైగా లైంగిక దాడికి గురవుతున్నారన్న గణాంకాలు వెల్లడైన నేపథ్యంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.