గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారి నోటా
గుజరాత్ రాజ్యసభ స్థానాల్లో నోటా ప్రవేశపెడుతున్నారు. ఏ అభ్యర్థికి ఓటు వేయవద్దనుకుంటే 'నోటా'ను నొక్కవచ్చు. ఈ విధానాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ స్థానాల్లో నోటా ప్రవేశపెడుతున్నారు. ఏ అభ్యర్థికి ఓటు వేయవద్దనుకుంటే 'నోటా'ను నొక్కవచ్చు. ఈ విధానాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నారు.
గుజరాత్ ఎఫెక్ట్: కర్నాటక మంత్రి ఇంట్లో, రిసార్టులో ఐటీ దాడులు
రాజ్యసభ ఎన్నికల్లో ఇలా ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ నెల 8న గుజరాత్లో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్ను ఉపయోగించరు. ఓటేసిన ఎమ్మెల్యేలు తమ పత్రాన్ని తమ పార్టీ పోలింగ్ ఏజెంట్కు చూపించిన తర్వాతే బ్యాలెట్ బాక్సులో వేయ్యాల్సి ఉంటుంది.
మరోవైపు గుజరాత్లో మూడు స్థానాలకు జరిగే ఎన్నికలను బిజెపి, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బిజెపి నుంచి అమిత్ షా, స్మృతీ ఇరాని పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ పోటీ పడుతున్నారు.