వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: పశువులను దొంగిలించారని ఇద్దర్ని కొట్టి చంపారు

|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ పశువులను దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు ముస్లింలను గ్రామస్థులు కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

గొడ్డా జిల్లాలోని దుల్లు గ్రామంలో బుధవారం రాత్రి మున్షి ముర్ము ఇంటి నుంచి ఐదుగురు వ్యక్తులు బర్రెలను దొంగిలించారనే అనుమానంతో గ్రామస్థులు వారిపై దాడి చేశారని డీఐజీ అఖిలేష్‌ కుమార్‌ ఝా చెప్పారు.

In Jharkhand’s Godda, two people lynched for ‘stealing’ buffaloes; four arrested

తమ బర్రెలు కనిపించకపోవడంతో ముర్ముతో పాటు ఇతర గ్రామస్థులు ఐదుగురు వ్యక్తుల కోసం గాలించగా గురువారం తెల్లవారుజామున సమీప బంటకి గ్రామంలో వారిని గుర్తించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు సిరాబుద్దీన్‌ అన్సారి (35), ముర్తజా అన్సారీ(30)లను తీవ్రంగా కొట్టడంతో వారు ప్రాణాలు వదిలారు.

మిగిలిన ముగ్గురు తప్పించుకుని పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సంబంధించి ముర్ముతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. కాగా, బాధితులు ఇదే జిల్లాకు చెందిన తలిజారి గ్రామస్తులని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు గ్రామంలో పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

English summary
Two men caught by villagers for allegedly stealing buffaloes were beaten to death by a mob Wednesday at Bankatti village in Jharkhand’s Godda district. While four men were arrested after the lynching, police said three more suspected cattle thieves managed to flee.
Read in English: Two Muslim men lynched
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X