క్లాస్ రూమ్ లో వైద్య విద్యార్థినిపై యువకుడు అలా...ఎందుకంటే?
కేరళ కొట్టాయంలోని మెడికల్ కాలేజీ క్లాస్ రూమ్ లో తోటి విధ్యార్థులు చూస్తుండగానే ఆదర్శ్ అనే అదే కాలేజీకి చెందిన మాజీ విధ్యార్థి క్లాస్ రూమ్ లోనే ఓ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.
తిరువనంతపురం:క్లాసు రూమ్ లో అందరూ చూస్తుండగానే ఓ వైద్య విధ్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ యువకుడు.అంతే కాదు తాను కూడ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకొంది.
కేరళ కొట్టాయంలోని మెడికల్ కాలేజీలో క్లాస్ రూమ్ లో ఆదర్శ్ అనే విధ్యార్థి అదే కాలేజీలో చదవుకొన్నాడు. బుదవారం నాడు మధ్యాహ్నం కాలేజీకి వచ్చి క్లాస్ రూమ్ లో ఓ విద్యార్థిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు.
ఆ విధ్యార్థిని క్లాస్ రూమ్ నుండి తప్పించుకొనే ప్రయత్నం చేయగా ఆమెను వెంటాడి మరీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు.తాను కూడ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు.
అయితే ఆ విధ్యార్థిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇధ్దరు విధ్యార్థులకు కూడ గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆదర్శ్ తో పాటు అతను నిప్పటించిన విధ్యార్థిని కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొట్టాయంలోని స్కూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో సమ్మె జరుగుతోంది. ఈ సమ్మె జరుగుతోండగా కొంతమంది విధ్యార్థులు క్లాస్ రూమ్ లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకొంది.