చైనాకు గట్టి సందేశం: టిబెట్ యూనిట్ సైనికుడు అంత్యక్రియల్లో రాం మాధవ్: అమరులకు నివాళి..
సరిహద్దులో ఉద్రిక్త నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కూడా అదేవిధంగా వ్యవహరిస్తోంది. సుబేదార్ అంత్యక్రియల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ పాల్గొన్నారు. ఇండియన్ యూనిట్ కోవర్టుగా పనిచేస్తోన్న స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ సుబేదార్ నైమా టెంజిన్ చనిపోయారు. అంత్యక్రియలకు రాం మాధవ్ హాజరై.. చైనాకు గట్టి సందేశం పంపించారు.
గతనెల 30వ తేదీన నైమా చనిపోయాడు. అయితే అతని మృతి గురించి ప్రభుత్వం/ సైన్యం ప్రకటన చేయలేదు. కానీ లెహ్లో సోమవారం అంత్యక్రియలు జరిగాయి. బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్.. హాజరయ్యారు. నైమా భౌతికదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. తర్వాత ట్వీట్ చేసి.. దానిని తర్వాత తీసివేశారు. పరాక్రమ సైనికుల త్యాగాలు ఇండో టిబెటన్ సరిహద్దులో శాంతిని కలిగిస్తోంది, అమరులందరికీ నిజమైన నివాళి ఆర్పించారు.
Recommended Video
గని పేలినప్పుడు నైమా చనిపోగా.. తన కుమారుడు లండన్ టెంజిన్ తీవ్రంగా గాయపడ్డారని రిటైర్డ్ హవాల్దార్ యేషి టెంజిన్ తెలపారు. లండన్కు తొలుత ప్రాథమిక వైద్యం అందజేసి.. తర్వాత లేహ్లోని మిలిటరీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. 29వ తేదీన తన కుమారుడు పనిచేశారని.. 30వ తేదీన ప్యొంగ్యాంగ్ టీఎస్వో దక్షిణ ఒడ్డున నైమా పనిచేశారని తెలిపారు. ఆ రోజు మైన్ పేలి చనిపోయాడని పేర్కొన్నారు. కానీ అధికార పార్టీ ముఖ్యనేత అంత్యక్రియల్లో పాల్గొనడం చర్చకు దారితీసింది. అదీ చైనాతో ఘర్షణ తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో అటెండ్ అవడంతో.. డ్రాగన్కు భారత్ గట్టి సందేశం పంపించినట్టు అనిపిస్తోంది.