వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగా ‌పథ్: జపాన్ నుంచి మెక్సికో వరకు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా 192 దేశాల్లో ఘనంగా జరుపుకున్నారు. న్యూఢిల్లీలోని రాజ్ పథ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ యోగా కార్యక్రమానికి సుమారు 40వేల మంది యువతీయువకులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. సుమారు అరగంటకుపైగా జరిగిన ఈ కార్యక్రమంతో రాజ్‌పథ్ యోగా పథ్‌గా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

శ్రీనగర్

శ్రీనగర్‌లో సాంప్రదాయ దుస్తుల్లో యోగా చేస్తున్న యవతులు.

వారణాసి

ప్రధాని పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని గంగా నది సమీపంలో యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రజలు.

బెంగళూరు

బెంగళూరులో యోగా చేస్తున్న స్థానిక ప్రజలు. ప్రధాని మోడీ షేర్ చేసిన ఫొటో.

బీజింగ్, చైనా

చైనాలోని బీజింగ్‌లో యోగా చేస్తున్న ప్రజలు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ట్వీట్ చేసిన ఈ ఫొటోను ప్రధాని మోడీ షేర్ చేశారు.

మెక్సికన్ సిటీ, మెక్సికో

మెక్సికన్ సిటీలో సమారు 700మంది ప్రజలు యోగా చేస్తున్న ఈ ఫొటోను శ్రీశ్రీ రవిశంకర్ షేర్ చేశారు.

భోపాల్, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేసిన ఈ ఫొటోను ప్రధాని మోడీ షేర్ చేశారు.

భోపాల్, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేసిన ఈ ఫొటోను ప్రధాని మోడీ షేర్ చేశారు.

సిడ్నీలో ఇండియా

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ సిడ్నీలో ప్రారంభించారు. ఈ ఫొటోను ప్రధాని మోడీ షేర్ చేశారు.

మలేషియా

దక్షిణ చైనా సముద్రంలోని మలేషియా కౌంటన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత నావికాదళం అధికారులు, సిబ్బంది.

ఫిజి

ఫిజిలో యోగా చేస్తున్న ప్రజలు. ఈ ఫొటోను ఎంఈఏ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ షేర్ చేశారు.

కాబూల్, ఆఫ్ఘనిస్థాన్

ఆప్ఘనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో యోగా దినోత్సవం.

శ్రీలంక

శ్రీలంకలోని గాలే వద్ద సామూహిక యోగా చేస్తున్న ప్రజలు.

హిరోషియా, జపాన్

జపాన్‌లోని హిరోషిమాలో యోగా చేస్తున్న ప్రజలు. ఈ ఫొటోను ప్రధాని మోడీ షేర్ చేశారు.

బాలి, ఇండోనేషియా

ఇండోనేషియాలోని బాలిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు యోగా చేస్తున్న దృశ్యం.

రాజ్ పథ్, న్యూఢిల్లీ

న్యూఢిల్లీలోని రాజ్ పథ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ యోగా కార్యక్రమానికి సుమారు 40వేల మంది యువతీయువకులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Sunday joined an estimated 37,000 people on the Rajpath in performing yoga in record-breaking attempt to mark the International Yoga Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X