నడిరోడ్డుపై 11 మంది ఒకేసారి..: ఒళ్లు గగుర్పొడిచేలా (వీడియో)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై పదకొండు మంది కత్తులతో దాడి చేశారు. పట్టపగలే అతనిని దారుణంగా నరికి చంపారు.
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై పదకొండు మంది కత్తులతో దాడి చేశారు. పట్టపగలే అతనిని దారుణంగా నరికి చంపారు.
ఏకంగా 27సార్లు ఆ వ్యక్తిని కర్కశంగా నరికారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
రఫీకుద్దీన్ అనే వ్యక్తి స్థానికంగా నేరాలు చేస్తుండేవాడు. అతడు ధులే రోడ్డు పక్కన టీ తాగుతుండగా ఒకేసారి పదకొండు మంది కత్తులు, కర్రలు, తుపాకీతో వచ్చి దాడికి పాల్పడ్డారు.
తొలుత కర్రలతో కొట్టి అనంతరం కత్తులతో 27 సార్లు పొడిచారు. ఆ తర్వాత తుపాకీతో అతడిపై కాల్పులు జరిపారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత స్కూటర్లు, బైకులపై పారిపోయారు.
పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగే సమయంలో వర్షం కూడా వస్తుండటంతో ఆ ప్రాంతం భీతావాహంగా కనిపించింది. హత్యకు గురైన వ్యక్తిపై 30 క్రిమినల్ కేసులు ఉన్నాయి.