ఎగవేత: ముత్తూట్ ఫిన్కార్ప్పై ఐటీ దేశవ్యాప్త దాడులు
న్యూఢిల్లీ: ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించిన దేశంలోని ప్రధాన కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపారు. ముత్తూట్ జార్జ్(ఫిన్కార్ప్), ముత్తూట్ పప్పాచాన్, మిని ముత్తూట్, ముత్తూట్ మార్కంటైల్(ఫ్యామిలీ బిజినెస్) కార్యాలయాలు, కేరళలోని కొఝెంచెర్రీలోని ప్రధాన కార్యాలయంపై కూడా దాడులు కొనసాగుతున్నాయి.
పప్పాచాన్ గ్రూపు సంస్థ ఆదాయపు పన్ను చెల్లించని కారణంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బంగారం రుణాల్లో నిబంధనలు పాటించకపోవడం, నిధులు సేకరించడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.
గతంలో నిబంధనలకు వ్యతిరేకంగా ముత్తూట్ ఫైనాన్స్ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తోందని అభియోగాలు రావడంతో రిజర్వు బ్యాంకు తీవ్రంగా పరిగణించింది. అంతేగాక, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించవద్దని ఆదేశాలు జారీ చేసి, వాటిపై నిషేధం విధించింది.