వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ ఐటీ శాఖ: ఐటీ రిటర్న్స్ దాఖలుకు రేపే ఆఖరు తేదీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఐటీ శాఖ స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలేనని స్పష్టం చేసింది. 2018-19 సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువులో ఎలాంటి పొడిగింపు లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్(సీబీడీటీ) తేల్చి చెప్పింది.

న్యాయ వ్యవస్థలోకి పాకిన కులగజ్జి..! ఆవేదన వ్యక్తం చేస్తున్న పాట్నా న్యాయమూర్తి ..!! న్యాయ వ్యవస్థలోకి పాకిన కులగజ్జి..! ఆవేదన వ్యక్తం చేస్తున్న పాట్నా న్యాయమూర్తి ..!!

2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పణకు గడువు రేపటికి(ఆగస్టు 31) వరకే ఉందని సీబీడీటీ స్పష్టం చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ సీబీడీటీ ఆర్డర్ పేరుతో చలామణి అవుతున్న వార్తల్లో నిజం లేదని ఐటీ విభాగం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

 Income tax return filing deadline not extended again, clarifies tax department

కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరింత గడువు ఇచ్చిందని, సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఐటీ శాఖ అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది.

సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించడానికి చివరి తేదీ జులై ముప్పై ఒకటే కానీ.. అయితే గడువు తేదీని పెంచాలని అభ్యర్థనలు వెల్లువెత్తడంతో రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31 వరకు సమయం ఇచ్చింది ఐటీశాఖ.

English summary
The income tax department has said that an order circulating on social media about extension of income tax filing deadline is not genuine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X