మండ్యలో సుమలత భారీ విజయం, సీఎం కుమారస్వామికి ఎదురు దెబ్బ, పరువు ప్రతిష్ట అంటే !
బెంగళూరు: మండ్య లోక్ సభ నియోజక వర్గంలో చివరిదాకా నువ్వానేనా అంటూ పోటీ ఎదుర్కొన్న బహుబాష నటి సుమలత చివరికి భారీ విజయం సాధించారు. సుమలత ఎంపీగా విజయం సాధించడంతో సీఎం కుమారస్వామితో పాటు సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ పడింది.
స్వంతత్ర పార్టీ అభ్యర్థిగా మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సుమలతకు స్థానికులు భ్రహరథం పట్టారు. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ అభ్యర్థిగా సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేశారు. మొదటి రౌండ్ నుంచి సుమలత, నిఖిల్ కుమారస్వామి పోటీ పడ్డారు.
స్వంతత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతకు బీజేపీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రెబల్స్ తెర వెనుక సుమలతకు మద్దతు ఇచ్చారు. మండ్య జిల్లాలో 8 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా సీఎం కుమారస్వామి పరువును కాపాడలేకపోయారు.
జేడీఎస్ కు కంచుకోట అయిన మండ్యలో నిఖిల్ కుమారస్వామి విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా సీఎం కుమారస్వామి శక్తి వంచన లేకుండా మండ్యలో ఎన్నికల ప్రచారం చేశారు. అయితే సీఎం కుమారస్వామి ఎత్తులు మండ్యలో పని చెయ్యలేదు.
మండ్యలో దాదాపు 76 వేల మెజారిటీతో సుమలత విజయం సాధించడంతో సీఎం కుమారస్వామి పరోక్షంగా ఓడిపోయినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటక చరిత్రలో 52 ఏళ్లలో మొదటి సారి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక మహిళ లోక్ సభలో అడుగుపెడుతున్నారు.