షాక్: బస్టాండ్లో బ్రిటన్ మహిళ ముందే హస్తప్రయోగం, భారత్ 'సారీ'
ముంబై: ఓ బ్రిటిష్ మహిళ ఎదుట ముంబైలోని ఓ బస్ స్టాప్ వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేశాడు. ఈ విషయాన్ని సదరు మహిళ బ్లాగ్లో పేర్కొన్నారు. దీంతో భారతీయులు పెద్ద ఎత్తున స్పందించారు. తమ దేశంలో ఎలా జరిగినందుకు ఆమెకు క్షమాపణలు చెప్పారు.
ఆమె పర్యటన నిమిత్తం భారత్ వచ్చారు. ఆ తర్వాత తనకు ఎదురైన సంఘటన పట్ల ఆమె ఆవేదన చెందుతూ బ్లాగ్లో రాశారు. దీంతో, భారతీయులు ఆమెకు మద్దతుగా నిలిచారు. మొత్తం భారతీయుల తరఫున క్షమాపణలు అంటూ ఆమెకు సందేశాలు వెల్లువెత్తాయి.
లూసీ హెమ్మింగ్స్ (27) మాట్లాడుతూ.. భారత్కు చెందిన మహిళలు, పురుషులు చాలామంది తనకు లెక్కలేనన్ని సందేశాలు పంపించారని, తన బ్లాగ్ చదివాక వారు క్షమాపణలు కోరుతూ వాటిని పంపించారని చెప్పారు.
'జరిగిన సంఘటన పైన, నా దేశం తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను' అని వ్యక్తి రాశారు.
'మా దేశంలో పర్యటించే సమయంలో మీకు అలాంటి అనుభవం జరగడం చాలా బాధాకరమైన విషయం' అని మరొకరు రాశారు.
ఇది సిగ్గుపడాల్సిన విషయమని, క్షమించాలని ఇంకొకరు రాశారు.
కాగా, లూసీ హెమ్మింగ్స్ మూడు నెలల పర్యటన కోసం భారత్ వచ్చారు. అనంతరం యూకేకు తిరిగి వెల్తూ, తనకు ఎదురైన చేదు అనుభవం గురించి బ్లాగ్లో రాశారు.
ఆమె ముంబైలోని ఓ బస్టాపులో కూర్చున్న సమయంలో ఆమెకు దగ్గరగా ఉన్న వ్యక్తి అలా చేశాడు. ఇలాంటి వాటి పట్ల తాను భయాందోళనకు గురయ్యానని ఆమె పేర్కొన్నారు.