వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాతో కీలక చర్చలు: ఐదు సూత్రాల అమలుకు రెండు దేశాల అంగీకారం: ఎంఈఏ వెల్లడి

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఉద్రిక్తతల నివారణ కోసం రెండు దేశాలూ ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు తీవ్రస్థాయి హెచ్చరికలు చేసుకుంటున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) విషయంలో భారత్ అంగీకరించని 1959నాటి ఒప్పందం ప్రకారం భూభాగాలు తమవేనన్న చైనా వాదనను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చడం, లదాక్ ను కేంద్ర పాలిత గుర్తించబోమన్న డ్రాగన్ ప్రకటనపైనా ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తాజాగా..

ఆలయాలపై దాడులు:జగన్ సర్కారుకు చినజీయర్ సూచన - డిక్లరేషన్‌పై సీఎంను సమర్థించినా..ఆలయాలపై దాడులు:జగన్ సర్కారుకు చినజీయర్ సూచన - డిక్లరేషన్‌పై సీఎంను సమర్థించినా..

భారత్-చైనా మధ్య బుధవారం దౌత్యపరమైన చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుత పరిస్థితిని ఇరు పక్షాలు సమీక్షించాయి. సరిహద్దుల్లోని ఉద్రిక్తతలకు తెర దించడానికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీలు రష్యాలో జరిపిన చర్చల్లో రూపొందించిన ఐదు సూత్రాలపై ప్రధాన దృష్టితో ఈ చర్చలు జరిగాయి.

India, China agree to implement Jaishankar-Wang 5-point plan, says MEA

చైనాతో చర్చలకు సంబంధించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఎల్ఏసీ వెంబడి ప్రస్తుత పరిస్థితిని రెండు దేశాలు సమీక్షించాయని, ఆగస్టు 20న వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం అనంతరం జరిగిన పరిణామాలపై సవివరంగా చర్చించినట్లు పేర్కొంది. ఇరు దేశాల రక్షణ మంత్రులు జరిపిన చర్చల్లో రూపొందించిన 5 పాయింట్లపై ప్రధాన దృష్టితో తాజా చర్చలు జరిగినట్లు పేర్కొంది.

సీబీఐకి భారీ షాక్: 40వేల సాక్ష్యాలు, 100 ఆడియో, వీడియో టేపులు నిరాధారం - తీర్పుపై సవాలు దిశగాసీబీఐకి భారీ షాక్: 40వేల సాక్ష్యాలు, 100 ఆడియో, వీడియో టేపులు నిరాధారం - తీర్పుపై సవాలు దిశగా

సైనిక చర్చల్ని ఇకపైనా కొనసాగించాలని దౌత్య చర్చల్లో రెండు దేశాలు భావిస్తున్నాయని, సరిహద్దులో వివాదాల పరిష్కారం కోసం లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి తదుపరి (7వ రౌండ్) చర్చలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని ఇరు పక్షాలు అంగీకరించినట్లు ఎంఈఏ తెలిపింది. సైనికాధికారుల గత సమావేశంలో.. సరిహద్దువైపునకు కొత్తగా బలగాలను తరలించకూడదన్న అంగీకారం కుదరగా, పూర్తిగా దళాల ఉపసంహరణ జరిగేందుకు సైతం కృషి చేయాలని నిర్ణయించినట్లు ఎంఈఏ పేర్కొంది.

English summary
India and China on Wednesday held another round of diplomatic dialogue on the border standoff in eastern Ladakh, and emphasised the need to implement the decisions arrived at the last round of military talks to avoid misunderstandings and maintain stability on the ground. After the virtual talks under the framework of the Working Mechanism for Consultation and Coordination on border affairs, the ministry of external affairs said the two sides reviewed the current situation along the Line of Actual Control and "positively evaluated" the outcome of the sixth meeting of their senior commanders last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X