భారీ విరాళం: భారత్ది పెద్ద మనసు
న్యూఢిల్లీ: భారత్ మరో సారి పెద్ద మనసు చాటుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే విపత్తులకు సహాయం అందించే ఐక్యరాజ్య సమితి అత్యవసర నిధికి భారీ విరాళాన్ని ప్రకటించింది.
2015-16 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి అత్యవసర సేవల విభాగమైన సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ (సీఈఆర్ఎఫ్) కు 5,00,000 డాలర్లు ( రూ. 34 కోట్లు) విరాళంగా అంధించింది. ఇంతే మొత్తాన్ని 2014 సంవత్సరానికి ప్రకటించింది.
మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అంశాల్లో భారత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ముందు నుంచే ప్రపంచ దేశాల్లో తలెత్తిన విపత్తులకు భారత్ సహాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు తమ వంతుగా భారత్ భారీ విరాళాన్ని ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే విపత్తులకు సహాయం అందించే విషయంలో తమ వంతు సహకారం అంధిస్తామని భారత్ తరుపున ఐక్యరాజ్య సమితి సేవల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ సింగ్ తెలిపారు.