వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లీంలు అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ధర్మసత్రమా ?, ఆ సీఎం దేశద్రోహి, కేంద్ర మంత్రి ఫైర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని దేశాల ముస్లీంలు భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే ఇక్కడ వారికి ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ధర్మసత్రం కాదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా భారత్ ఇరుగు పొరుగు దేశాలకు చెందిన ముస్లీంలు అర్జీ సమర్పిస్తే వారికి భారత్ సౌరసత్వం ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం బిల్లును వ్యతిరికేస్తూ కొందరు కావాలనే రాజకీయం చేస్తూ ఆందోళనకారులను రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విచారం వ్యక్తం చేశారు.

నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

ఈ మతాలు వాళ్లు ఎక్కడికి పోవాలి ?

ఈ మతాలు వాళ్లు ఎక్కడికి పోవాలి ?

ప్రపంచంలోని ముస్లీంలు అందరికీ ఇక్కడ ఆశ్రమం ఇస్తే భారతదేశంలోని మిగితా మతాలకు చెందిన వారు ఎక్కడికి వెలుతారు? అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అని ఆయన పౌరసత్వ చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని పరోక్షంగా ప్రశ్నించారు. భారతదేశంలో చట్ట ప్రకారం అందరూ జీవించడానికి హక్కు ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ దేశాల ముస్లీంలకే భారత్ లో చాన్స్ ఇస్తాం

ఈ దేశాల ముస్లీంలకే భారత్ లో చాన్స్ ఇస్తాం

పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బాంగ్లాదేశ్ తదితర దేశాల్లోని కొందరి అరాచకాలకు, హింసకు, అణిచివేతకు గురైన హిందూ, క్రైస్తవులు, బౌద్దులు, జైన్, సిక్కులు, పార్శీ మతాలకు చెందిన వారికి భారత్ పౌరసత్వం ఇస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సుమారు 5 లక్షల కుటుంబాలకు భారత్ పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉందని అన్నారు.

భారత్ ధర్మసత్రమా ?

భారత్ ధర్మసత్రమా ?

ప్రపంచ దేశాల్లోని అందరూ ముస్లీంలకు భారత్ పౌరసత్వం ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషం తేల్చి చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం వలన భారతదేశంలోని ముస్లీంలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎప్పటిలాగే వారు హాయిగా ఇక్కడ జీవించడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తోందని, కొందరు కావాలనే ఇలా రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విచారం వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ లో హిందువులు ఏమైనారు ?

పాకిస్తాన్ లో హిందువులు ఏమైనారు ?

1947లో పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య 18.7 శాతం ఉండేదని, ఇప్పుడు కేవలం 1.6 శాతం మంది హిందువులు అక్కడ ఉన్నారని, మిగిలిన వాళ్లు ఏమైనారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆందోళన చేస్తున్న వారిని ప్రశ్నించారు. బాంగ్లాదేశ్ లో సైతం మొదట 22 శాతం హిందువులు ఉంటే ప్రస్తుతం 8.5 శాతం మంది హిందువుల మాత్రమే అక్కడ ఉన్నారని, అఫ్ఘనిస్తాన్ లో 22 వేల మంది హిందువులు, సిక్కులు ఉంటే ప్రస్తుతం 500 మంది మాత్రమే ఉన్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విచారం వ్యక్తం చేశారు.

మమతా బెనర్జీ దేశ్రద్రోహి !

మమతా బెనర్జీ దేశ్రద్రోహి !

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతికిస్తూ ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి కుళ్లు రాజకీయాలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశద్రోహి అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసి అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విచారం వ్యక్తం చేశారు.

English summary
New Delhi: India is not orphanage home to give citizenship to all nations muslims said central minister Prahlad Joshi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X