ఒకేసారి 30 స్థానాలు ఎగబాకిన భారత్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 100వ స్థానం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభ వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత్ గత ఏడాది నుంచి ఈ ఏడాదికి ఏకంగా 30 స్థానాలు ఎగబాకింది.
న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభ వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత్ గత ఏడాది నుంచి ఈ ఏడాదికి ఏకంగా 30 స్థానాలు ఎగబాకింది.
ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన డూయింగ్ బిజినెస్ 2018: రీఫార్మింగ్ టు క్రియేట్ జాబ్స్ తాజా జాబితాలో భారత్ 100వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 130వ స్థానంలో ఉన్న భారత్లో ఈసారి గణనీయ మెరుగుదల కనిపించింది.
ఒక ఏడాదిలో ఇన్ని స్థానాలు మెరుగుపడడం ఇదే తొలిసారి. పన్ను చట్టాల్లో సంస్కరణలు, లైసెన్సింగ్ విధానం, పెట్టుబడుదారులకు భద్రత, దివాళా చట్టం వంటివి భారత్ ర్యాంకు మెరుగుదలకు దోహదం చేశాయి.
టాప్ 100లో నిలిచిన భారత్కు ఇదే అత్యుత్తమ ర్యాంకు. మొత్తం 190 దేశాలకు సంబంధించిన వివరాలు వెల్లడించగా అందులో భారత్ గతంలో కంటే మెరుగైన స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో న్యూజిలాండ్ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్, డెన్మార్క్, సౌత్ కొరియా, హాంకాంగ్, అమెరికా, బ్రిటన్ దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. రష్యా 35వ స్థానంలో, చైనా 78వ స్థానంలో నిలిచాయి.