వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Light Lamp baby: రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దీపయజ్ఞం, అంబులెన్స్ లో బిడ్డ, గ్రేట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) పై కదనానికి దేశ ప్రజలు సంఘీభావం తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీప కాంతితో భారతావని వెలుగులీనింది. కరోనా వైరస్ రక్కసి అంతానికి దేశ ప్రజలు ఐక్యంగా దీపాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. కరోనా వైరస్ పై పోరాటానికి సంఘీభావంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన దీపయజ్ఞం విజయవంతం అయ్యింది. దేశం మొత్తం దీప కాంతితో వెలుగుతున్న సమయంలో ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాల సమయంలో ఓ మహిళ ఆసుపత్రికి వెలుతున్న సమయంలో అంబులెన్స్ లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దేశం మొత్తం ఒకే సారి దీపాలు వెలుగించిన సమయంలో పుట్టిన ఆ చిన్నారి చరిత్రలో నిలిచిపోయాడు.

Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!

Recommended Video

Light Lamps: Watch PM Modi lights diyas And BJP bigwigs illuminate diyas, candles
 మారుమూల గ్రామం

మారుమూల గ్రామం

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హోసదుర్గ సమీపంలోని అడవిసంగేహళ్ళి గ్రామంలో రేఖ, గురుమూర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. రేఖ నిండు గర్బిణి. ఆదివారం రాత్రి రేఖకు పురుటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

లాక్ డౌన్ ఇబ్బందులు !

లాక్ డౌన్ ఇబ్బందులు !

కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోనే రేఖకు పురుటి నొప్పులు ఎక్కువ కావడం ఆమె కుటంబ సభ్యులు ఆందోళన చెందారు. రేఖను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గ్రామంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు.

 రాత్రి 9 గంటల 9 నిమిషాలకు

రాత్రి 9 గంటల 9 నిమిషాలకు

అడవిసంగేహళ్ళి గ్రామానికి అంబులెన్స్ రావడం కొంచెం ఆలస్యం అయ్యింది. అంబులెన్స్ వచ్చిన తరువాత రేఖను హోసదుర్గలోని ఆసుపత్రికి తీసుకెలుతున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ఆసుపత్రికి వెలుతున్న సమయంలో అంబులెన్స్ లో రేఖ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

 దీపయజ్ఞం బిడ్డ

దీపయజ్ఞం బిడ్డ

కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశం మొత్తం దీపయజ్ఞంకు పిలుపునిచ్చారు. దేశం మొత్తం విద్యుత్ దీపాలు ఆఫ్ చేసి దీపాలు వెలిగించి దేశం మొత్తం ఏకతాటిపై ఉన్న సమయంలో ఆవెలుగులో అంబులెన్స్ లో పుట్టిన మగబిడ్డ నిజంగా అదృష్టవంతుడని చెప్పాలి. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా అంబులెన్స్ లో పుట్టిన మగబిడ్డ, తల్లి క్షేంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద వంద కోట్ల మందికి పైగా ఒకే సారి దీపాలు వెలిగించిన సమయంలో 9 గంటల 9 నిమిషాలకు పుట్టిన ఈ మగబిడ్డ చాలా అదృష్టవంతుడు.

English summary
Lockdown Light Lamp baby: Yesterday PM Narendra Modi called to Light a Lamp at night 9 to show unity to fight against Coronavirus. At that time baby took birth in Hosadurga in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X