వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో భారతే సహనశీలి: వయోలిన్ విద్వాంసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ప్రపంచంలోనే భారత దేశం అత్యంత సహనశీల దేశమని ప్రముఖ వయోలిన్ విద్వాంసులు పద్మభూషణ్ ఎల్ సుబ్రహ్మణ్యం అన్నారు. గతంలో భారత్ పైన ఎన్నో దాడులు జరిగాయన్నారు. భారత్ ఎన్ని దాడులను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడు కూడా అసహనాన్ని ప్రదర్శించలేదన్నారు.

భారత దేశంలో ఎవరి మీద ఎవరైనా, ఏమైనా మాట్లాడుకోవచ్చునని, ఆ స్వతంత్రం ఉందని చెప్పారు. అలాంటి విమర్శలు మీడియాలోను చక్కగా ప్రచురితం అవుతాయన్నారు. వార్తా చానళ్లలో వస్తాయని చెప్పారు. మిగతా దేశాల్లో అలాంటి స్వతంత్రం ఉండదని అభిప్రాయపడ్డారు.

India most tolerant country in the world: L Subramaniam

ఇదొక్కటి చాలు మన దేశం ఎంత సహనశీలంగా ఉంటుందో చెప్పడానికి అని ఆయన పేర్కొన్నారు. ఎక్కడో ఒకటి రెండు సంఘటనలు జరిగినంత మాత్రాన వాటిని చూపించి భారత దేశంలో అసహనం తీవ్రమైందని చెప్పడం ఏమాత్రం భావ్యం కాదన్నారు.

మనం ఎంతో ఉన్నత సంస్కారం కలిగిన వాళ్లమని, మన దేశాన్ని అత్యంత శక్తివంతమైనదిగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం కావాలని సూచించారు. కాగా, డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గాయకురాలైన తన భార్య కవితా కృష్ణమూర్తితో కలిసి లక్ష్మీనారాయణ గ్లోపల్ మ్యూజిక్ ఫెస్టివెల్ కోసం వచ్చారు.

English summary
Amidst the raging debate on growing 'intolerance' in the country, violin virtuoso and composer Dr L Subramaniam today took a varying point of view, saying India was one of the most tolerant countries in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X