డ్రగ్స్ రాకెట్ ముఠా అరెస్టు: బాలీవుడ్ నిర్మాత అరెస్టు
న్యూఢిల్లీ: డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు దేశంలోనే అతి పెద్ద డ్రగ్ రాకెట్ చేధించారు. దాదాపు 23,500 కిలోల మాండ్రాక్స్ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ డ్రగ్స్ విలువ రూ.4,700 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు.
ఈ కేసుతో ప్రమేయం ఉందని బాలీవుడ్ సినీ నిర్మాత సుభాష్ డుడాని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. రూ. 4,700 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని డీఆర్ఐ జనరల్ జయంత్ మిశ్రా అన్నారు. గత నెల 28వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిందని ఆయన చెప్పారు.
కచ్చితమైన వివరాలు తెలుసుకున్న తరువాత దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. అయితే ఈ కేసులో బాలీవుడ్ నిర్మాత సుభాష్ డుడానిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ దందాలో ఇంకా ఎంత మంది ప్రమేయం ఉందని అని ఆరా తీస్తున్నామని డీఆర్ఐ జనరల్ జయంత్ మిశ్రా వివరించారు.