ఏప్రిల్-ఆగస్టులో భారత ఎనిమిది ప్రధాన పరిశ్రమల్లో 8.5 శాతం క్షీణత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనేక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా లాక్డౌన్ కారణంగా గత కొద్ది నెలలుగా నిలిచిపోయిన పరిశ్రమల కార్యకలాపాలు ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. భారతదేశ మౌలిక సదుపాయాల ఎనిమిది ప్రధాన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మౌలిక సదుపాయాల ఎనిమిది ప్రధాన రంగాలు ఈ ఏడాది 8.5 శఆతం క్షీణత నమోదు చేసి ఆగస్టులో 117.6కు చేరింది. ఈ మేరకు కామర్స్ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
స్టీల్, రిఫనరీ ఉత్పత్తులు, సిమెంట్ ఉత్పత్తి వరుసగా ఆరో నెల కూడా క్షీణతనే నమోదు చేయడం గమనార్హం. 2019 ఆగస్టులో ఎనిమిది కోర్ పరిశ్రమల సూచిక 0.2 శాతం తగ్గింది.
కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫనరీ ఉత్పత్తులు, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తులు ఈ ఎనిమిది రంగాల్లో ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపి) లో చేర్చబడిన వస్తువుల బరువులో ఇవి 40.27 శాతంగా ఉన్నాయి.
బొగ్గు, ఎరువులు మినహా మిగిలిన రంగాలు ఆగస్టు నెలలో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.ఏప్రిల్-ఆగస్టు కాలంలో, ఎనిమిది కోర్ రంగాలు ఏడాది క్రితం కంటే 17.8 శాతం కుదించాయి. ఈ రంగాలు ఏడాది క్రితం ఇదే కాలంలో 2.5 శాతం పెరిగాయి.