భారత తొలి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూత
డెహ్రాడూన్: భారతదేశంలో తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కంచన్ చౌదరి భట్టాచార్య అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1973 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన భట్టాచార్య.. 2004లో ఉత్తరాఖండ్ డీజీపీగా నియమితులై చరిత్ర సృష్టించారు. ఆమె అక్టోబర్ 31, 2007లో రిటైరయ్యారు.
రిటైరైన తర్వాత ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు. హరిద్వార్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 2014లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఓటమిపాలవడంతో పార్లమెంటు దిగువసభలో అడుగుపెట్టలేకపోయారు కంచన్ చౌదరి.
భట్టాచార్య మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపం ప్రకటించారు. తొలి మహిళా డీజీపీగా చరిత్ర సృష్టించిన కంచన్ చౌదరి భట్టాచార్య మరణవార్తను తనను బాధకు గురిచేసిందన్నారు. డీజీపీగా రిటెరైన తర్వాత కూడా ఆమె ప్రజా సేవ చేశారని అన్నారు. ఆమెను తామంతా మిస్ అవుతున్నామని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో తెలిపారు.
Saddened to know about the passing away of the country's first woman DGP Ms Kanchan Chaudhary Bhattacharya.
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 27, 2019
She remained active in public life after her retirement and wanted to serve the country till her very last.
Will miss her. RIP
కంచన్ చౌదరి భట్టాచార్య సేవలను ఉత్తరాఖండ్ పోలీసు శాఖ గుర్తు చేసుకుంది. తమ మార్గదర్శకుల్లో ఒకరైన చౌదరి మృతి తమను ఆవేదనకు గురిచేసందంటూ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె మనసున్న అధికారి అంటూ కొనియాడింది. ఆమె ఎన్నో అవార్డులను సొంతం చేసుకుందని ఉత్తరాఖండ్ పోలీసు శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.