దేశంలో పెద్ద పులి ‘మచ్లీ’ మరణించింది (వీడియో)
రాంథమ్ బోర్ (రాజస్థాన్): దేశంలోనే పెద్ద పులిగా పిలుచుకుంటున్న మచ్లీ (19) ఇక లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న మచ్లీ గురువారం మరణించింది. రెండు రోజుల పాటు నీరసంగా ఉన్న మచ్లీ చివరికి చికిత్స విఫలమై మరణించింది.
రాజస్థాన్ లోని రాంథమ్ బోర్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఉన్న మచ్లీ భారీ దేహం, గంభీరమైన రూపంతో ఉంటుంది. అది ఎదురుపడాలని ఫోటోగ్రాఫర్లు, పర్యాటకులు గంటల తరబడి వేచి చూసేవారు.
మచ్లీ కనపడితే చాలు అనుకునే వారు లక్షల మంది ఉన్నారు. మచ్లీని చూడటానికే చాల మంది రాంథమ్ బోర్ టైగర్ రిజర్వు ఫారెస్టుకు వెలుతుంటారు. ఇటీవల మచ్లీ కోరలు ఊడిపోవడంతో పస్తులు ఉంటుంది.
గత రెండు రోజుల నుంచి ఆహారం ముట్టలేదు. వైద్యులు రెండు రోజుల పాటు చికిత్స చేసినా ఫలితం లేదు. గురువారం మచ్లీ మరణించిందని రాంథమ్ బోర్ టైగర్ రిజర్వు ఫారెస్టు అధికారులు తెలిపారు. పులులు 14 నుంచి 15 సంవత్సరాలు బతుకుతాయి. మచ్లీ 19 సంవత్సరాల బతికింది. 1997 నుంచి మచ్లీ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఉంది.