తొలిసారి విదేశాలకు మన కరోనా వ్యాక్సిన్- మాల్దీవులు, భూటాన్లకు కోవిషీల్డ్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ను విజయవంతంగా అమల్లోకి తెచ్చిన దేశంగా గుర్తింపు పొందిన భారత్ ఇప్పుడు క్రమంగా విదేశాలకు కూడా వ్యాక్సిన్ ఎగుమతులు ప్రారంభించింది. అయితే ముందుగా భారత ఉపఖండంలోని పొరుగు దేశాలకు ఈ వ్యాక్సిన్ డోసులను పంపుతున్నారు. తొలి విడతగా భూటాన్, మాల్దీవులకు భారత్లో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపారు.
Recommended Video
పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను భూటాన్, మాల్దీవులకు ఇవాళ ఎగుమతి చేశారు. భూటాన్కు ట్రక్కులతో పాటు విమానాల ద్వారా పూణే నుంచి ఈ డోసులు పంపారు. మాల్దీవులతో పాటు భూటాన్కు మరికొన్ని డోసులను విమానాల్లో పంపుతున్నారు. పొరుగుదేశాలకు ప్రాధాన్యమిచ్చే భారత విదేశాంగ విధానంలో భాగంగా ఉపఖండంలోని అన్ని దేశాలకు ఈ వ్యాక్సిన్ డోసులు పంపబోతున్నారు.
ఇవాళ భూటాన్, మాల్దీవులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వెళ్లాయి. రేపటి నుంచి పొరుగున ఉన్న ఇతర దేశాలు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సియాషెల్స్కు కూడా పంపాలని కేంద్రం నిర్ణయించింది. పాకిస్తాన్కు పంపాలా వద్దా అన్న దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్కు కూడా పంపితే భారత్ ఉపఖండంలోని అన్ని దేశాలకు మేడిన్ ఇండియా వ్యాక్సిన్ పంపినట్లవుతుంది. పొరుగున ఉన్న చైనా ఉపఖండంలో దేశాల్లో వైరస్ వ్యాప్తికి కారణమైతే బారత్ మాత్రం వ్యాక్సిన్లు పంపి ఆదుకోవడం విశేషం.