గాలిలో విమానాన్ని కూల్చేసిన క్షిపణి -డీఆర్డీవో తయారీ క్యూఆర్సామ్ పరీక్ష విజయవంతం
భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసే దిశగా కీలక ప్రణాళికలు రూపొందించుకున్న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో అడుగు ముందుకు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కీలక క్షిపణుల్ని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.
Recommended Video
'ఐ' తీస్తే శవం -'ఏ' తీస్తే మృతం -మాజీ సీఎం భార్యకు కౌంటర్ -పండుగ వేళ చావు రాజకీయం
అన్ని రకాల వాతావరణాల్లో పనిచేసే 'క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ సామ్) క్షిపణుల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా లోని చందీపూర్ లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ల ద్వారా మధ్యాహ్నం 3.40 గంటలకు ఈ అధునాతన క్షిపణులను పరీక్షించారు.
గాలిలో ప్రయాణిస్తోన్న పైలట్ రహిత బన్షీ విమానాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, ఆ విమానాన్ని క్యూఆర్ సామ్ మిస్సైల్ గురితప్పకుండా తాకింది. మీడియం రేంజి, మీడియం ఆల్టిట్యూడ్ లో ఈ పరీక్షల్ని చేపట్టారు. యుద్ధ రంగంలో శత్రు విమానాలను కూల్చగల సత్తా ఉన్న ఈ క్షిపణి పరిధి 30 కిలోమీటర్లు. క్యూఆర్ సామ్ తయారీలో 'ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఐఆర్డీఈ)కూడా పాలుపంచుకుంది.
16న జగన్ భవితవ్యం: తర్వాతి సీఎం ఎవరు? -సుప్రీం నోటీసులు -సాయిరెడ్డికి చుక్కలు: ఎంపీ రఘురామ
క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ఎస్ఏఎమ్)కు సంబంధిచి డీఆర్డీవో పరీక్షలు విజయవంతం కావడంతో తదుపరి దశలో స్వల్ప రేంజ్ క్షిపణిని ఆర్మీ, వైమానిక దళం పరీక్షించనుంది. ఆ తర్వత ఉత్పత్తిలోకి వెళ్లేముందు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ లతో ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో భారత్ మిస్సైళ్ల తయారీ, పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడింది.