ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ఇక దొరకదు.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనం..
కొత్త మోడల్ కార్లు, బైకుల అమ్మకాలు పెరిగినా.. వాటిని నడపడానికి వాడే పెట్రోల్, డీజిల్ గ్రేడు మాత్రం అప్ డేట్ కాలేదు. ప్రస్తుతం మనమంతా యూరో-4 లేదా భారత్ స్టేజ్(బీఎస్-6) ఇంధనాన్ని వాడుతున్నాం. బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ బీఎస్-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నాం. దీనివల్లే కాలుష్య ఉద్గారాలను అనుకున్న స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈ సమస్యకు పరిష్కారంగా మోదీ సర్కార్ ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనాన్ని అందుబాటులోకి తేనుంది.
బీఎస్-6 ఇంధనమంటే..
యూరో-6
గ్రేడ్
ఇంధనాన్ని
ప్రపంచంలోనే
అత్యంత
శుద్ధి
అయిన
ఇంధనంగా
పిలుస్తారు.
ఏప్రిల్
1
నుంచి
మనకు
అందుబాటులోకి
రానున్నది
కూడా
అదే.
కాకుంటే
యూరో-6
పేరును
మనం
బీఎస్-6గా
వ్యవహరిస్తాం.
ప్రపంచంలోని
మిగతా
దేశాలకు
సాధ్యపడని
రీతిలో
కేవలం
మూడేండ్ల
కాలంలోనే
ఇండియా
యూరో-6కు
అప్
గ్రేడ్
కావడం
విశేషం.
యూరో-4
నుంచి
యూరో-5
అవసరం
లేకుండానే
భారత్
నేరుగా
యూరో-6
కి
పొదబోతుండటం
గమనార్హం.
లోకల్ పెట్రోల్ బంకులకు సప్లై ఇలా..
ఏప్రిల్1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 గ్రేడ్ ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చే విషయమై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తని ప్రారంభించాయని, ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా ప్రతి చుక్కను యూరో-6(బీఎస్-6) గ్రేడ్ గా మార్చబోతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధన సరఫరాను మొదలుపెట్టాయని, దేశ వ్యాప్తంగా ఉన్న స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని వివరించారు.
Recommended Video
లాభనష్టాలివే..
యూరో-6 గ్రేడ్ ఇంధనం అత్యంత శుద్ధి చేసింది కావడంతో దీని ద్వారా కాలుష్య ఉద్గారాలు ఉత్పన్నం కాబోవు. కొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీతోపాటు అన్ని ప్రధాన నగరాల్లో వాహన కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో బీఎస్-6 రాకతో సమస్యకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది. అయితే బీఎస్-6 ఇంధన ఉత్పత్తి కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయి. ఈ పెరుగుదల లీటరుకు 50 పైసల నుంచి ఒక రూపాయి మధ్య ఉండే అవకాశముంది.