వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ఇక దొరకదు.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనం..

|
Google Oneindia TeluguNews

కొత్త మోడల్ కార్లు, బైకుల అమ్మకాలు పెరిగినా.. వాటిని నడపడానికి వాడే పెట్రోల్, డీజిల్ గ్రేడు మాత్రం అప్ డేట్ కాలేదు. ప్రస్తుతం మనమంతా యూరో-4 లేదా భారత్ స్టేజ్(బీఎస్-6) ఇంధనాన్ని వాడుతున్నాం. బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ బీఎస్-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నాం. దీనివల్లే కాలుష్య ఉద్గారాలను అనుకున్న స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈ సమస్యకు పరిష్కారంగా మోదీ సర్కార్ ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనాన్ని అందుబాటులోకి తేనుంది.

బీఎస్-6 ఇంధనమంటే..

బీఎస్-6 ఇంధనమంటే..


యూరో-6 గ్రేడ్ ఇంధనాన్ని ప్రపంచంలోనే అత్యంత శుద్ధి అయిన ఇంధనంగా పిలుస్తారు. ఏప్రిల్ 1 నుంచి మనకు అందుబాటులోకి రానున్నది కూడా అదే. కాకుంటే యూరో-6 పేరును మనం బీఎస్-6గా వ్యవహరిస్తాం. ప్రపంచంలోని మిగతా దేశాలకు సాధ్యపడని రీతిలో కేవలం మూడేండ్ల కాలంలోనే ఇండియా యూరో-6కు అప్ గ్రేడ్ కావడం విశేషం. యూరో-4 నుంచి యూరో-5 అవసరం లేకుండానే భారత్ నేరుగా యూరో-6 కి పొదబోతుండటం గమనార్హం.

లోకల్ పెట్రోల్ బంకులకు సప్లై ఇలా..

లోకల్ పెట్రోల్ బంకులకు సప్లై ఇలా..

ఏప్రిల్1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 గ్రేడ్ ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చే విషయమై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తని ప్రారంభించాయని, ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా ప్రతి చుక్కను యూరో-6(బీఎస్-6) గ్రేడ్ గా మార్చబోతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధన సరఫరాను మొదలుపెట్టాయని, దేశ వ్యాప్తంగా ఉన్న స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని వివరించారు.

Recommended Video

వరుసగా 9వ రోజూ తగ్గిన పెట్రోలు - డీజిల్ ధరలు | Oneindia Telugu
లాభనష్టాలివే..

లాభనష్టాలివే..

యూరో-6 గ్రేడ్ ఇంధనం అత్యంత శుద్ధి చేసింది కావడంతో దీని ద్వారా కాలుష్య ఉద్గారాలు ఉత్పన్నం కాబోవు. కొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీతోపాటు అన్ని ప్రధాన నగరాల్లో వాహన కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో బీఎస్-6 రాకతో సమస్యకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది. అయితే బీఎస్-6 ఇంధన ఉత్పత్తి కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయి. ఈ పెరుగుదల లీటరుకు 50 పైసల నుంచి ఒక రూపాయి మధ్య ఉండే అవకాశముంది.

English summary
India will join the select league of nations using petrol and diesel containing just 10 parts per million of sulphur as it looks to cut vehicular emissions that are said to be one of the reasons for the choking pollution in major cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X