ఇండియా టుడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సర్వే, ఎవరికి ఎంత శాతం ఓట్లు అంటే!
న్యూఢిల్లీ: 2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఇండియా టుడే, కార్వీ సంస్థ నిర్వహించిన ఎన్నికల సర్వేని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. 38 శాతం మంది సీఎం సిద్దరామయ్య తీరు బాగుందని సర్వేలో వెల్లడించారు. 33 శాతం మంది సీఎం సిద్దరామయ్య మళ్లీ సీఎం కావాలని కోరుకున్నారు.
31 శాతం మంది సీఎం సిద్దరామయ్య పనితీరు పర్వాలేదని సర్వేలో చెప్పారు. 29 శాతం మంది సీఎం సిద్దరామయ్య పనితీరు ఏ మాత్రం బాగాలేదని సర్వేలో వెల్లడించారు. 21 శాతం మంది జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని సర్వేలో వెల్లడించారు.
26 శాతం మంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప సీఎం కావాలని కోరుకుంటున్నారని ఇండియా టుడే, కార్వీ సంస్థ సర్వే వెల్లడించింది. అయితే నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సీఎం కావాలని మూడు శాతం మంది కోరుకుంటున్నారని ఇండియా టుడే, కార్వీ సంస్థ సర్వే వెల్లడించింది. మొత్తం మీద కాంగ్రెస్ కు అనుకూలంగా సర్వే విడుదల కావడంతో బీజేపీ నాయకులు సందిగ్దంలో పడిపోయారు.