వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహ్మదాబాద్ టెస్ట్‌: భారత్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గెలుచుకున్న కోహ్లీ సేన

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
IndiavsEngland

భారత్ ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

చివరి టెస్టులో విజయంతో నాలుగు టెస్టుల ఈ సిరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది.

https://twitter.com/ICC/status/1368144158066581507

రెండో ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ 160 పరుగుల ఆధిక్యం సాధించింది.

వాషింగ్టన్ సుందర్ 96 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అశ్విన్ 13, అక్షర్ పటేల్ 43 పరుగులు చేశారు. ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్ పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు.

ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జేమ్స్ అండర్సన్‌ 3, జాక్ లీచ్ 2 వికెట్లు పడగొట్టారు.

తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్, 135 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లండ్ జట్టులో డేనియల్ లారెన్స్ (50), జో రూట్ (30) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అక్షర్ పటేల్, అశ్విన్ చెరి ఐదు వికెట్లు పడగొట్టారు.

3-1తో సిరీస్ గెలుచుకున్న భారత్ ఐసీసీ టెస్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది.

https://twitter.com/ICC/status/1368145335751761920

ఈ జాబితాలో 520 పాయింట్లతో భారత్ టాప్‌లో నిలిచింది. మొత్తం ఆరు సిరీస్‌లలో 12 మ్యాచ్‌లు గెలిచిన భారత్ 4 మ్యాచ్‌లు కోల్పోయి, 1 డ్రా చేసింది.

ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన న్యూజీలాండ్‌తో లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో తలపడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
India vs England:Team India wins test series against England
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X