2019లో బీజేపీ గెలిస్తే భారత్ 'హిందూ పాకిస్తాన్' అవుతుంది: శశిథరూర్
Recommended Video
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో మళ్లీ బీజేపీయే గెలిస్తే భారత్ హిందూ పాకిస్తాన్ అవుతుందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్లో ఇతర హిందువులను, క్రైస్తవులను, సిక్కులను ఎలా చూస్తారో తెలిసిందే.
భారత్లో బీజేపీ మళ్లీ గెలిస్తే అలాగే అయ్యే పరిస్థితులు తలెత్తుతాయని థరూర్ అన్నారు. ఒకవేళ లోకసభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాత్రం మన ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం యథాతథంగా మనుగడ సాగించడం కష్టమని వ్యాఖ్యానించారు.
శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ నిప్పులు చెరిగింది. హిందూపాకిస్థాన్ అంటూ శశిథరూర్ వ్యాఖ్యానాలు చేయడం సిగ్గుచేటు అని బీజేపీ నేత సంబీత్ మహాపాత్ర ట్వీట్ చేశారు.
భారత్ను చిన్నగా చేసి చూపించడానికి, హిందువులను అపఖ్యాతిపాలు చేసేందుకు కాంగ్రెస్ ఇలా వెనుకాడటం లేదని మండిపడ్డారు. హిందువులను అవమానించేందుకు ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్ వదులుకోదని, దానిని సంపూర్ణంగా ఉపయోగించుకుంటుందని ఎద్దేవా చేశారు.